ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య శనివారం ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ గెలుపొందిన విషయం విదితమే. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. సురేష్ రైనా గత సీజన్లో ఆడకపోయినా ఈ మ్యాచ్లో రీ ఎంట్రీతో ఆరంభ మ్యాచ్లోనే 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే బౌలింగ్లో విఫలం కావడంతో చెన్నై ఓటమి పాలైంది.
ఢిల్లీ జట్టు కేవలం 18 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్లు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేశారు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం చెన్నై కెప్టెన్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించినట్లు తెలిపింది. 3 సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలిచినా గత సీజన్లో చెత్త ప్రదర్శన కారణంగా చెన్నై తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇక ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లోనే ఓడింది. దీంతో చెన్నైకి దురదృష్టం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు.
కాగా మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ధోనీ మాట్లాడుతూ.. తమ బ్యాట్స్మెన్ బాగానే బ్యాటింగ్ చేశారని, డిఫెండ్ చేసే స్కోరును ఉంచారని, అయినప్పటికీ బౌలర్లు విఫలం అయ్యారని, అందువల్లే ఓడామని అన్నాడు. ముందు ముందు మ్యాచ్లలో బౌలర్లు మరింత పొదుపుగా బౌలింగ్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…