ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య శనివారం ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ గెలుపొందిన విషయం విదితమే. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. సురేష్ రైనా గత సీజన్లో ఆడకపోయినా ఈ మ్యాచ్లో రీ ఎంట్రీతో ఆరంభ మ్యాచ్లోనే 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే బౌలింగ్లో విఫలం కావడంతో చెన్నై ఓటమి పాలైంది.
ఢిల్లీ జట్టు కేవలం 18 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్లు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేశారు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం చెన్నై కెప్టెన్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించినట్లు తెలిపింది. 3 సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలిచినా గత సీజన్లో చెత్త ప్రదర్శన కారణంగా చెన్నై తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇక ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లోనే ఓడింది. దీంతో చెన్నైకి దురదృష్టం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు.
కాగా మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ధోనీ మాట్లాడుతూ.. తమ బ్యాట్స్మెన్ బాగానే బ్యాటింగ్ చేశారని, డిఫెండ్ చేసే స్కోరును ఉంచారని, అయినప్పటికీ బౌలర్లు విఫలం అయ్యారని, అందువల్లే ఓడామని అన్నాడు. ముందు ముందు మ్యాచ్లలో బౌలర్లు మరింత పొదుపుగా బౌలింగ్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…