ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య శనివారం ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ గెలుపొందిన విషయం విదితమే. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. సురేష్ రైనా గత సీజన్లో ఆడకపోయినా ఈ మ్యాచ్లో రీ ఎంట్రీతో ఆరంభ మ్యాచ్లోనే 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే బౌలింగ్లో విఫలం కావడంతో చెన్నై ఓటమి పాలైంది.
ఢిల్లీ జట్టు కేవలం 18 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్లు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేశారు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం చెన్నై కెప్టెన్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించినట్లు తెలిపింది. 3 సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలిచినా గత సీజన్లో చెత్త ప్రదర్శన కారణంగా చెన్నై తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇక ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లోనే ఓడింది. దీంతో చెన్నైకి దురదృష్టం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు.
కాగా మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ధోనీ మాట్లాడుతూ.. తమ బ్యాట్స్మెన్ బాగానే బ్యాటింగ్ చేశారని, డిఫెండ్ చేసే స్కోరును ఉంచారని, అయినప్పటికీ బౌలర్లు విఫలం అయ్యారని, అందువల్లే ఓడామని అన్నాడు. ముందు ముందు మ్యాచ్లలో బౌలర్లు మరింత పొదుపుగా బౌలింగ్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…