ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆకట్టుకునే వీడియోలను షేర్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఆయన తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. కొన్ని మేకలన్నీ కలసి పాలు తాగుతున్న వీడియో అది. దాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ఒక వ్యక్తి పాలతో నిండిన బాటిల్స్ను తెచ్చి ఒక స్టాండ్లో వరుసగా పెట్టగానే అక్కడే ఉన్న మేక పిల్లలు అన్నీ ఆ బాటిల్స్లోని పాలను తాగడం ప్రారంభించాయి. అయితే కొన్ని మేకలకు బాటిల్స్ అందకపోవడంతో ఆ వ్యక్తి వాటిని తీసి పక్కనే ఉన్న ఇంకొన్ని బాటిల్స్ వద్ద ఉంచాడు. ఈ క్రమంలో మేకలన్నీ తోకలు ఊపుతూ భలే సరదాగా పాలను తాగడం ప్రారంభించాయి.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో దానికి ఇప్పటికే 1.70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. రక రకాల కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. చూడబోతే ఇది ఓ సింపుల్ వీడియో లాగే ఉంది. కానీ ప్రపంచం దీని ద్వారా ఒక శక్తి రూపాన్ని సృష్టించవచ్చు.. అని ఆనంద్ మహీంద్రా ఆ వీడియోకు కామెంట్ పెట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…