ముంబైలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 టోర్నీ రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. చెన్నై ఉంచిన భారీ లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పంత్ సేన చెన్నైపై విజృంభించింది. దీంతో చెన్నైపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో సురేష్ రైనా, మొయిన్ అలీలు రాణించారు. 36 బంతులు ఆడిన రైనా 3 ఫోర్లు, 4 సిక్సర్లలో 54 పరుగులు చేయగా, 24 బంతుల్లో మొయిన్ అలీ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, అవేష్ ఖాన్లు చెరో 2 వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్, టామ్ కుర్రాన్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 190 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్, పృథ్వీ షాలు రాణించారు. 54 బంతుల్లో ధవన్ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేయగా, 38 బంతుల్లో షా 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. బ్రేవోకు 1 వికెట్ దక్కింది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…