ప్రముఖ మొబైల్ గేమ్ పబ్జి వల్ల ఎంత మంది ఎన్ని రకాలుగా నష్టపోయారో గతంలో అనేక సంఘటనల్లో మనం చూశాం. ఈ గేమ్ను ఆడకపోవడం వల్ల కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరైతే కుటుంబ సభ్యులకు చెందిన డబ్బును దొంగిలించి గేమ్లో ఐటమ్లను కొనేందుకు ఖర్చు చేశారు. అయితే పాకిస్థాన్లో ఆ వ్యక్తి మాత్రం ఇంకాస్త ముందుకే వెళ్లాడు. పబ్జి గేమ్లో ప్లేయర్లు ఎలాగైతే ఒకర్నొకరు కాల్చి చంపుకుంటారో దాన్ని రియల్ లైఫ్కు అనువదించుకుని అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులను గన్తో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే…
పాకిస్థాన్లోని లాహోర్ ప్రాంతం నవా కోట్ లో నివాసం ఉండే బిలాల్ పబ్జి గేమ్కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట తన భార్యకు కూడా విడాకులు ఇచ్చాడు. అయితే గేమ్ను ఆడొద్దని చెప్పినందుకు ఓ గన్ సంపాదించి ఇంట్లోని కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. తన సోదరుడు, సోదరి, మరదలు, ఇంకొకరిని కాల్చాడు. దీంతో ఆ నలుగురు అక్కికక్కడే చనిపోయారు.
ఇక ఆ వ్యక్తి చేసిన దాడిలో తన తల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ఇంటి నుంచి కాల్పులు, పెద్ద అరుపులు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే అక్కడకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా పాకిస్థాన్లో 2020లో ఈ గేమ్ను బ్యాన్ చేశారు. కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గేమ్పై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…