ప్రముఖ మొబైల్ గేమ్ పబ్జి వల్ల ఎంత మంది ఎన్ని రకాలుగా నష్టపోయారో గతంలో అనేక సంఘటనల్లో మనం చూశాం. ఈ గేమ్ను ఆడకపోవడం వల్ల కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరైతే కుటుంబ సభ్యులకు చెందిన డబ్బును దొంగిలించి గేమ్లో ఐటమ్లను కొనేందుకు ఖర్చు చేశారు. అయితే పాకిస్థాన్లో ఆ వ్యక్తి మాత్రం ఇంకాస్త ముందుకే వెళ్లాడు. పబ్జి గేమ్లో ప్లేయర్లు ఎలాగైతే ఒకర్నొకరు కాల్చి చంపుకుంటారో దాన్ని రియల్ లైఫ్కు అనువదించుకుని అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులను గన్తో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే…
పాకిస్థాన్లోని లాహోర్ ప్రాంతం నవా కోట్ లో నివాసం ఉండే బిలాల్ పబ్జి గేమ్కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట తన భార్యకు కూడా విడాకులు ఇచ్చాడు. అయితే గేమ్ను ఆడొద్దని చెప్పినందుకు ఓ గన్ సంపాదించి ఇంట్లోని కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. తన సోదరుడు, సోదరి, మరదలు, ఇంకొకరిని కాల్చాడు. దీంతో ఆ నలుగురు అక్కికక్కడే చనిపోయారు.
ఇక ఆ వ్యక్తి చేసిన దాడిలో తన తల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ఇంటి నుంచి కాల్పులు, పెద్ద అరుపులు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే అక్కడకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా పాకిస్థాన్లో 2020లో ఈ గేమ్ను బ్యాన్ చేశారు. కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గేమ్పై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…