కరోనా వల్ల గతేడాది చాలా ఆలస్యంగా ఐపీఎల్ జరిగినప్పటికీ ప్రస్తుతం మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ ప్రారంభమైంది. ఐపీఎల్ 14వ ఎడిషన్ ఈ నెల 9వ తేదీన ప్రారంభం అయింది. వేసవిలో క్రికెట్ అభిమానులకు ఎప్పటిలా ఐపీఎల్ వినోదాన్ని అందించనుంది. అయితే ఐపీఎల్ వల్ల ఈ సారి ఈ-కామర్స్ సంస్థలు, ఫుడ్ డెలివరీ యాప్లకు ఎంతగానో మేలు జరుగుతుందని, వారి వ్యాపారాలు జోరుగా కొనసాగుతాయని పలువురు వ్యాపారవేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్ సమయంలో చాలా మంది సోషల్ మీడియా, టీవీలకు అతుక్కుపోయారు. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో విహరించారు. ప్రస్తుతం సరిగ్గా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అనేక చోట్ల పాక్షిక లాక్డౌన్లు, కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగించాయి. కనుక ఇప్పుడు కూడా అలాగే వాటి వ్యాపారం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఎల్ను ఈసారి చాలా మంది టీవీల్లోనే వీక్షిస్తారు కనుక ఆ మ్యాచ్లలో యాడ్స్ ను ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని, తద్వారా బిజినెస్ ఎక్కువగా చేయాలని ఈ-కామర్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందువల్ల ఐపీఎల్ ఈసారి ఈ-కామర్స్ సంస్థలకు సహాయం చేస్తుందని చెప్పవచ్చు.
ఇక కరోనా వల్ల అనేక చోట్ల నిబంధనలను విధించారు. బార్లు, రెస్టారెంట్లను మూసి వేశారు. ఐపీఎల్ ఉన్న రోజుల్లో ప్రేక్షకులు వాటికి వెళ్లి మ్యాచ్లను వీక్షిస్తూ మద్యం, ఫుడ్ తీసుకుంటూ ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడవి లేవు. దీంతో ఇళ్లలో లేదా బంధువులు, స్నేహితులతో కలసి ఒక్క చోట కూర్చుని మ్యాచ్లను ఎంజాయ్ చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. కనుక వారు సహజంగానే ఫుడ్ కోసం ఫుడ్ డెలివరీ యాప్లపై ఆధార పడతారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఈ వ్యాపారానికి కూడా మేలు చేయనుంది. మరి ఈసారి ఐపీఎల్ వల్ల ఆయా రంగాలు ఎంతగా లాభ పడతాయో చూడాలి.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…