Ganguly : భారత వన్డే క్రికెట్ జట్టుకు కెప్టెన్గా విరాట్ కోహ్లిని తప్పించి అతని స్థానంలో కెప్టెన్గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లిని వన్డే కెప్టెన్గా తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ మండిపడ్డారు. కాగా ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా స్పందించారు.
విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్గా తప్పించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని గంగూలీ వెల్లడించారు. ఈ మేరకు గంగూలీ ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. విరాట్ కోహ్లి 9 ఏళ్ల నుంచి 3 ఫార్మాట్ల క్రికెట్కు ఆడుతున్నాడు. 5 ఏళ్ల నుంచి కెప్టెన్గా ఉన్నాడు. అతనిపై ఎంతో ఒత్తిడి ఉంది.
టీ20లకు కెప్టెన్గా కోహ్లి ఇప్పటికే తప్పుకున్నాడు. వన్డేలకు కొనసాగుతానని చెప్పాడు. అయితే సెలెక్టర్లు మాత్రం తెల్ల బంతితో ఆడే క్రికెట్ ఫార్మాట్లు టీ20, వన్డేలకు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుందని చెప్పారు. అందుకనే కోహ్లిని తప్పించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అతనికి ముందే చెప్పాం. అతను అర్థం చేసుకున్నాడు.. అని గంగూలీ తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…