Ganguly : భారత వన్డే క్రికెట్ జట్టుకు కెప్టెన్గా విరాట్ కోహ్లిని తప్పించి అతని స్థానంలో కెప్టెన్గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లిని వన్డే కెప్టెన్గా తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ మండిపడ్డారు. కాగా ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా స్పందించారు.
విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్గా తప్పించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని గంగూలీ వెల్లడించారు. ఈ మేరకు గంగూలీ ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. విరాట్ కోహ్లి 9 ఏళ్ల నుంచి 3 ఫార్మాట్ల క్రికెట్కు ఆడుతున్నాడు. 5 ఏళ్ల నుంచి కెప్టెన్గా ఉన్నాడు. అతనిపై ఎంతో ఒత్తిడి ఉంది.
టీ20లకు కెప్టెన్గా కోహ్లి ఇప్పటికే తప్పుకున్నాడు. వన్డేలకు కొనసాగుతానని చెప్పాడు. అయితే సెలెక్టర్లు మాత్రం తెల్ల బంతితో ఆడే క్రికెట్ ఫార్మాట్లు టీ20, వన్డేలకు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుందని చెప్పారు. అందుకనే కోహ్లిని తప్పించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అతనికి ముందే చెప్పాం. అతను అర్థం చేసుకున్నాడు.. అని గంగూలీ తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…