Lord Brahma : మనిషి జన్మించిన వెంటనే బ్రహ్మ దేవుడు తలరాతను రాస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ తలరాతకు అనగుణంగా ఆ మనిషి జీవితం ఆధార పడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ తమ తలరాత బాగా లేదని, అందుకనే అంతా నష్టమే జరుగుతుందని దిగులు చెందుతుంటారు. తలరాత అనేది నిజమే.
మనం కొన్ని సార్లు ఎంత కష్టపడినా.. ఆశించిన ఫలితం అయితే దక్కదు. కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. అంతా తలరాత అని మనం సర్దుకుపోతుంటాం. అయితే అలాంటి తలరాతను మార్చుకునేందుకు వీలుంటుందా ? అంటే.. అందుకు పురాణాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
మనం పుట్టినప్పుడు బ్రహ్మ దేవుడు మన నుదుటిపై ఒక వాక్యం రాస్తాడట. నేను రాసే రాతతోనే కాక, మీరు చేసే పనులు, చేసే పాప పుణ్యాలతో కూడా మీ తలరాత మారుతుంది.. అని రాస్తాడట. దీన్ని బట్టి చూస్తే మనం చేసే పనులు, పాప పుణ్యాలు కూడా మన తలరాతను నిర్దేశిస్తాయని స్పష్టమవుతోంది. అందుకు ఉదాహరణగా ఒక రాజు కథను చెప్పవచ్చు.
పూర్వం విభుముఖుడు అనే ఓ రాజు ఉండేవాడు. అతనికి 50వ ఏట మరణ గండం ఉంటుంది. జ్యోతిష్యుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న అతను దాన్నుంచి బయట పడేందుకు అనేక పుణ్య కార్యాలు చేస్తాడు. అలాగే దైవార్చన, మృత్యుంజయ జపం చేస్తాడు. దీంతో అతను మరణ గండం నుంచి బయట పడి నిండు నూరేళ్లు జీవిస్తాడు.
ఇక పురాణాల ప్రకారం మహాభారతంలో దుర్యోధనుడికి 128 ఏళ్ల ఆయుష్షు ఉండేదట. కానీ అతను చేసిన పాపపు పనులు.. ముఖ్యంగా ద్రౌపదిని చెరబట్టడం వల్ల అతను 60వ ఏటనే చనిపోయాడు. ఈ విధంగా మనం చేసే పనులు, పాప పుణ్యాలతోనే మన తలరాత నిర్ణయమవుతుందన్నమాట. అందుకనే నిత్యం దైవాన్ని పూజించాలని, సమాజంలో అందరికీ మంచి చేసే పనులు చేయాలని, ఇతరులకు సహాయం చేయాలని.. చెబుతుంటారు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…