Vinayaka Chavithi : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శనివారం భక్తులు పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య పూజకు ముహుర్తం ఉంది. కనుక ఆ సమయంలో చాలా మంది గణపతిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇక వినాయకుడికి అత్యంత ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదకాలను నైవేద్యంగా ఆయనకు సమర్పించి మనం ఏదైనా కోరుకుంటే దాన్ని ఆ వినాయకుడు నెరవేరుస్తాడని చెబుతారు. కనుక ఆయనకు వాటిని నైవేద్యంగా పెట్టడం మరిచిపోకండి.
ఇక వినాయక చవితి రోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి. ఈ రోజు ఎట్టి పరిస్థితిలోనూ మీరు రాత్రి పూట చవితి చంద్రున్ని చూడకండి. ఎందుకంటే చవితి నాడు చంద్రున్ని చూస్తే నీలాపనిందల పాలు కావల్సి వస్తుంది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. సకల దేవతలచే పూజలందుకున్న గణేషుడికి అందరూ పిండి వంటకాలతో భోజనం పెడతారు. దీంతో సహజంగానే భోజన ప్రియుడు అయిన గణేషుడు విందును భారీ ఎత్తున ఆరగించేస్తాడు. తరువాత అజీర్తి సమస్యతో బాధపడుతుంటాడు.
అలాంటి గణేషున్ని చూసిన చంద్రుడు ఫక్కున నవ్వుతాడు. దీంతో పార్వతీ దేవి ఆగ్రహిస్తుంది. చంద్రున్ని చూసిన వారందరూ నీలాపనిందల పాలు కావల్సి వస్తుందని శాపం పెడుతుంది. అయితే తాను తప్పు చేశానని, క్షమించమని కోరుతూ చంద్రుడు పార్వతీ దేవిని ప్రార్థిస్తాడు. దీంతో ఆమె తాను పెట్టిన శాపాన్ని కాస్త సవరిస్తుంది. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే చంద్రున్ని చూస్తే నీలాపనిందల పాలు అవుతారు.. అని చెబుతుంది. ఇక అప్పటి నుంచి ఎవరూ వినాయక చవతి రోజు చంద్రున్ని చూడడం లేదు.
కానీ ఒకసారి శ్రీకృష్ణుడు గోవుకు పాలు పిండి ఆ పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తాడు. దీంతో ఆయనపై శమంతకమణిని దొంగిలించాడనే నెపం వేస్తారు. అప్పుడు ఆయన జాంబవంతుడితో పోరాడి ఆ మణిని సాధించి తెచ్చి తిరిగి దాని యజమానికి అప్పగిస్తాడు. ఇలా కృష్ణుడు ఆయనపై పడిన నిందను పోగొట్టుకుంటాడు. కనుక చవితి నాడు చంద్రున్ని మీరు ఎట్టి పరిస్థితిలోనూ చూడకండి. లేదంటే అనవసరంగా మీరు నిందలపాలు కావల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…