Doctor Prescription : కింద ఇచ్చిన ఫోటోను ఇప్పటికే మీరు చూసి ఉంటారు. ఇది ఏదో చిన్న పిల్లాడు రాసిన గీతలు కావు. ఒక డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్. అవును, మీరు విన్నది నిజమే. డాక్టర్లు మనకు అర్థం కాని విధంగా సహజంగానే ప్రిస్క్రిప్షన్ రాస్తుంటారు. ఆ ప్రిస్క్రిప్షన్ కేవలం మెడికల్ షాపు వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. అంత వరకు బాగానే ఉంది. కానీ మరీ ప్రిస్క్రిప్షన్ ఈవిధంగా ఉంటే ఎలా చెప్పండి. మెడికల్ షాపు వాళ్లకు కూడా అర్థం కాలేదు. అవును, ఆ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ను తాము చదవలేకపోయామని మెడికల్ షాపు వాళ్లు కూడా చేతులెత్తేశారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో ఉన్న నాగౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఓ రోగికి అక్కడి ప్రభుత్వ డాక్టర్ అమిత్ సోనీ కొన్ని మందులను వాడాలని చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ ను రాసి ఇచ్చాడు. దీంతో అతను ఆ చిట్టీని పక్కనే ఉన్న మెడికల్ స్టోర్లో చూపించాడు. అయితే ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను చూసిన మెడికల్ షాపు వాళ్లు ఖంగు తిన్నారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని వారు చెప్పారు. దీంతో అవాక్కవడం రోగి వంతైంది. డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ సహజంగానే అర్థం కాదు. కానీ మరీ మెడికల్ షాపు వాళ్లకు కూడా అర్థం కాని విధంగా ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాశాడు. దీంతో అతనిపై ఫిర్యాదు చేశారు.
ఇక ఈ సంఘటనపై సదరు జిల్లా హాస్పిటల్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎల్కే తివారీ మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే డాక్టర్ అమిత్ సోనీకి నోటీసులు జారీ చేశామని, అతని నుంచి సమాధానం రాగానే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక అమిత్ సోనీ రాసిన ప్రిస్క్రిప్షన్ ను తాము కూడా చదవలేకపోయామని తివారీ చెప్పడం విశేషం. ఏది ఏమైనా ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా ఒకసారి చూడండి. అర్థం అయితే చెప్పండి.
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…