Black Chickpeas : పూర్వకాలంలో మన పెద్దలు సహజసిద్ధమైన ఆహారం తినేవారు. అందుకనే వారు అంత దృఢంగా, ఆరోగ్యంగా ఎక్కువ ఏళ్లపాటు జీవించగలిగే వారు. కానీ ఇప్పుడు మనం జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ తింటున్నాం. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. దీనివల్ల కొందరు ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటున్నారు. అయితే మన పెద్దలు తిన్నట్టు మనం కూడా సహజసిద్ధమైన ఆహారాలను తింటే దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక అలాంటి ఆహారాల్లో శనగలు కూడా ఒకటి. వీటిలో రెండు రకాలు ఉంటాయి.
ఒకటి నల్ల శనగలు, రెండోది కాబూలీ శనగలు. కాబూలీ శనగలకు మీద పొట్టు ఉండదు కానీ నల శనగలకు పొట్టు ఉంటుంది. కనుక పొట్టు ఉన్న నల్ల శనగలను మనం రోజూ తినాల్సి ఉంటుంది. మనం రోజూ వీటిని తింటే అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనగలను ఉదయం ఉడకబెట్టుకొని లేదని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మనకి రోజూ నిద్ర సరిగ్గాపడుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారు రోజు నల్ల శనగలను గనక తింటుంటే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయటపడవచ్చు. కొలెస్ట్రాల్ లెలల్స్ అధికంగా ఉన్నవారు నల్ల శనగలను తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. నల్ల శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట, మలబద్ధకం ఉండవు. షుగర్ ఉన్న వారికి శనగలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని మరో రోజూ తింటుంటే షుగర్ లెవల్స్ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
శిరోజాల సంరక్షణకు కూడా శనగలు ఎంతగానో పనిచేస్తాయి శనగలను రోజూ తినడం వల్ల జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. శనగల్లో ఉండే క్యాల్షియం మన ఎముకలు, దంతాలను బలంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. వయసు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియో పోరోసిస్ అనే సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. చర్మ సమస్యలు ఉన్నవారు రోజూ శనగలను తింటే ఫలితం ఉంటుంది. ఎలాంటి అలర్జీలు అయినా సరే తగ్గిపోతాయి. ఈ విధంగా నల్ల శనగలు మనకు అనేక రకాలుగా మేలు చేస్తాయి కాబట్టి వాటిని రోజూ తినడం మర్చిపోకండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…