ప్రతి ఒక్కరికీ ఆర్థిక కష్టాలుంటాయి. అప్పులు, వడ్డీలు కట్టుకోలేక మానసికంగా, శారీరకంగా ఇబ్బది పడుతుంటారు. అయితే అలా కష్టాలు పుడుతున్న వారు ఉప్పుతో ఈ చిట్కా పాటిస్తే కచ్చితంగా కొంత మేర ఉపశమనం పొందగలుగుతారని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనందరం ఇంట్లో ఆహారపు రుచిని పెంచడానికి కచ్చితంగా ఉప్పును ఉపయోగిస్తాం. అయితే ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని మీకు తెలుసా. ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తొలగి ధనవంతులు అవుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అందుకోసం ఇలా చేయండి.
ఉప్పంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని వారు చెబుతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని చాలామంది చెబుతుంటారు. ఉప్పును ఉపయోగించి మనం సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా చేయవచ్చు. దీని కోసం ఒక కుండలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో డబ్బును ఉంచాలి. ఈ విధంగా డబ్బును ఒక రోజంతా ఉంచి మరుసటి రోజూ బీరువాలో పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ డబ్బుకు ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే మంగళవారం రాత్రి పూట ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ల ఉప్పును ఉంచి మూట కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి.
మరుసటి రోజు అనగా బుధవారం ఆ మూట విప్పి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో పోయాలి. ఇలా చేసిన వారికి ఆ వారమంతా పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులంటున్నారు. ఉప్పుతో ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుంది. అలాగే ఒక గాజు గిన్నెలో 2 చెంచాల ఉప్పు, నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. రుణ బాధలు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పైన చెప్పినవి పాటించి ధనలాభం పొంది ఆనందంగా ఉండండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…