నాలుగు పదుల వయసు దాటినా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు అందానికి ఎంతటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు మెసేజ్ ఒరియంటెడ్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్నారు.
భరత్ అనే నేను సినిమాతో మొదలు పెడితే.. మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట మొత్తంగా 4 చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. ప్రేక్షకులకు వినోదంతో పాటు మెసేజ్ అందిస్తున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి.
ఇప్పటివరకు మహేష్ బాబు యాడ్స్ లోను మరియు సినిమాలో నటిస్తూ ఎంత ఆస్తిని సంపాదించి ఉంటాడు అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనం ప్రకారం… మహేష్ బాబు ఆస్తుల విలువ 32 మిలియన్ డాలర్ల పై మాటే అని తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.244 కోట్ల వరకూ మహేష్ బాబు ఆస్తులు విలువ ఉందని తెలుస్తోంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో మహేష్ బాబుకి విలాసవంతమైన విల్లా ఉంది. దాని ధర దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా బెంగళూరులో కూడా మహేష్ బాబుకు కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నట్టు సమాచారం.
మహేష్ బాబు వద్ద అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. మహేష్ బాబు వద్ద ఉన్న లంబోర్ఘిని కారు విలువ రూ.3 కోట్లు ఉంటుంది. లబోర్ఘిని కారు మాత్రమే కాకుండా రూ.90 లక్షల విలువచేసే టయోటా ల్యాండ్ క్రూయిజర్ , 49 లక్షల విలువచేసే బెంజ్ కారు, రేంజ్ రోవర్ కార్, ఆడి కార్లు కూడా మహేష్ వద్ద ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.55 నుండి రూ.65 కోట్ల వరకు రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాడ్స్ కోసం మహేష్ బాబు ఏకంగా రూ.80 కోట్ల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…