ఓ సినిమా చేయడం అనేది.. మనం రెండు గంటల్లో సినిమా చూసినంత ఈజీ కాదు. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా పనులు ఉంటాయి. ఇంకా ఆర్టిస్టుల ఎంపిక హీరో హీరోయిన్ల ఎంపిక కత్తిమీద సాములాంటిదే. కథ ఎంత బాగున్నా హీరో హీరోయిన్లు సెట్ అవ్వకపోతే అంతే సంగతులు. అందుకే ఆ విషయంలో దర్శక నిర్మాతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి ముందు నుంచి అనుకున్న హీరోతో కాకుండా.. వేరే వారితో సినిమా చేయాల్సి రావొచ్చు. ఇలా ఇప్పటికే అనేకసార్లు జరిగింది. ఒకరు ఓకే చేసిన కథతో ఇంకొకరు మూవీ తీసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం.
ఇలాంటి సంఘటనే చిరంజీవి, వెంకటేష్ ల మధ్య కూడా జరిగింది. చిరు చేయాల్సిన ఓ సినిమాను వెంకటేష్ చేశారు. అది ఎలా అంటే.. నిర్మాతగా కేవీబీ సత్యనారాయణ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సుందరకాండ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో.. సత్యనారాయణ గారు రజనీకాంత్ నటించి సూపర్ హిట్ అయిన అన్నామలై సినిమాను తెలుగులో డబ్ చేయడానికి రైట్స్ తీసుకుని ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్నారు. అప్పుడు అదే ఫ్లైట్ లో ఆయన చిరంజీవి కలిశారు. ఆయనకు ఫ్లైట్ లోనే ఓ సినిమా కథ చెప్పడంతో.. చిరుకి బాగా నచ్చి చేయడానికి ఓకే చెప్పారు.
దాంతో చిరంజీవి ఓకే చెప్పాడు అనే సంతోషంలో సుందరకాండ షూటింగ్ దగ్గరకు వచ్చిన సత్యనారాయణ.. ఆ సినిమా స్టోరీని వెంకటేష్ కు కూడా చెప్పారు. అప్పుడు వెంకటేష్ ఈ సినిమా కూడా మానమే చేద్దాం అనడంతో.. సత్యనారాయణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇప్పుడు ఆ కథ చిరుతో తీయాలా.. లేక వెంకీతో తీయాలా అనే అయోమయంలో పడిపోయి.. తర్వాత చిరుకి అసలు విషయం చెప్పి.. ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ తోనే చేసారు. కొండపల్లి రాజాగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలా చిరు నుంచి వెళ్లిన కథతో వెంకీ హిట్ అందుకున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…