ఓ సినిమా చేయడం అనేది.. మనం రెండు గంటల్లో సినిమా చూసినంత ఈజీ కాదు. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా పనులు ఉంటాయి. ఇంకా ఆర్టిస్టుల ఎంపిక హీరో హీరోయిన్ల ఎంపిక కత్తిమీద సాములాంటిదే. కథ ఎంత బాగున్నా హీరో హీరోయిన్లు సెట్ అవ్వకపోతే అంతే సంగతులు. అందుకే ఆ విషయంలో దర్శక నిర్మాతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి ముందు నుంచి అనుకున్న హీరోతో కాకుండా.. వేరే వారితో సినిమా చేయాల్సి రావొచ్చు. ఇలా ఇప్పటికే అనేకసార్లు జరిగింది. ఒకరు ఓకే చేసిన కథతో ఇంకొకరు మూవీ తీసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం.
ఇలాంటి సంఘటనే చిరంజీవి, వెంకటేష్ ల మధ్య కూడా జరిగింది. చిరు చేయాల్సిన ఓ సినిమాను వెంకటేష్ చేశారు. అది ఎలా అంటే.. నిర్మాతగా కేవీబీ సత్యనారాయణ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సుందరకాండ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో.. సత్యనారాయణ గారు రజనీకాంత్ నటించి సూపర్ హిట్ అయిన అన్నామలై సినిమాను తెలుగులో డబ్ చేయడానికి రైట్స్ తీసుకుని ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్నారు. అప్పుడు అదే ఫ్లైట్ లో ఆయన చిరంజీవి కలిశారు. ఆయనకు ఫ్లైట్ లోనే ఓ సినిమా కథ చెప్పడంతో.. చిరుకి బాగా నచ్చి చేయడానికి ఓకే చెప్పారు.
దాంతో చిరంజీవి ఓకే చెప్పాడు అనే సంతోషంలో సుందరకాండ షూటింగ్ దగ్గరకు వచ్చిన సత్యనారాయణ.. ఆ సినిమా స్టోరీని వెంకటేష్ కు కూడా చెప్పారు. అప్పుడు వెంకటేష్ ఈ సినిమా కూడా మానమే చేద్దాం అనడంతో.. సత్యనారాయణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇప్పుడు ఆ కథ చిరుతో తీయాలా.. లేక వెంకీతో తీయాలా అనే అయోమయంలో పడిపోయి.. తర్వాత చిరుకి అసలు విషయం చెప్పి.. ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ తోనే చేసారు. కొండపల్లి రాజాగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలా చిరు నుంచి వెళ్లిన కథతో వెంకీ హిట్ అందుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…