ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయన మాస్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. దేశవ్యాప్తంగా పుష్ప మొదటి భాగం ఊహించని స్థాయిలో హిట్ అందుకుంది. దీంతో అల్లు అర్జున్కు అటు బాలీవుడ్లో కూడా డిమాండ్ ఏర్పడింది. అల్లు అర్జున్ తో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ -2 లో నటిస్తున్నాడు. పార్ట్ 2 పుష్ప ది రూల్ సినిమా పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక అసలు విషయానికి వెళ్తే అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వం వచ్చిన గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గంగోత్రి సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. గంగోత్రి చిత్రం కన్న మొదటి గా బన్నీ ఒక సూపర్ హిట్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉందట. ఆ సినిమా ఏంటంటే..
తేజ దర్శకత్వంలో నితిన్, సద హీరో హీరోయిన్ లు గా నటించిన జయం. అయితే ఈ సినిమాలో మొదటిగా అల్లు అర్జున్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారట. జయం చిత్రంతో అల్లు అర్జున్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారట దర్శకుడు తేజ.
కానీ ఆ అవకాశం కాస్త రాఘవేంద్రరావు దక్కించుకున్నారు. అప్పటికే బన్నీని రాఘవేంద్రరావు గంగోత్రి సినిమా కోసం సంప్రదించడం జరిగింది. దాంతో నైజాం ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి తనయుడు నితిన్ ను హీరోగా జయం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు తేజ. సరికొత్త కథాంశంతో క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన జయం చిత్రం జూన్ 14, 2002 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…