Karthika Pournami 2022 : ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి వచ్చేసింది. భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తూ శివుడికి అభిషేకాలు చేస్తున్నారు. ఈ సమయంలో శైవ క్షేత్రాల్లో సందడి నెలకొంటుంది. భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపం వెలిగిస్తారు. కార్తీక మాసం ముగిసే వరకు ఇలాగే చేస్తారు. అలాగే భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అన్ని నియమాలను పాటిస్తారు. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు పరమశివుడికి ఎంతో పవిత్రమైన దినం. కనుక భక్తులు తప్పక పూజలు చేయాలి.
ఇక ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ 8, 2022 మంగళవారం వచ్చింది. సాధారణంగా శివుడికి ఏడాది మొత్తం పూజలు చేసేవారు ఉంటారు. రోజూ ఉదయాన్నే లేచి స్నానం చేసి శివుడికి పూజలు చేసి దీపం వెలిగిస్తారు. అయితే ఏడాది మొత్తం ఇలా చేయకపోయినా ఫర్వాలేదు. కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం తప్పక శివుడికి పూజలు చేయాలి. ఉదయం స్నానం ముగిశాక శివుడికి పూజలు చేసి సరిగ్గా 365 ఒత్తులతో దీపాలను వెలిగించాలి. అంటే సంవత్సరం మొత్తం వెలిగించే దీపాలతో ఒకే రోజు శివున్ని పూజిస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం పూజలు చేసిన ఫలితం ఒక్క రోజే లభిస్తుంది. ఇది కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత అని చెప్పవచ్చు.
కార్తీక పౌర్ణమి రోజు వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోవద్దని పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక మాసంలో శివుడికి రుద్రాభిషేకం చేయడంతోపాటు బిల్వ పూజ చేస్తే ఎంతో మంచిది. అలాగే విష్ణువుకు కూడా పూజలు చేయాలి. విష్ణు సహస్రాబ్ది ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. దీంతోపాటు కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో మనం వెలిగించే దీపాలు మన జీవితాల్లో వెలుగులను నింపుతాయి. అలాగే మన పాపాలను కడిగేస్తాయి. ఎంతో పుణ్యం లభిస్తుంది. మనం సన్మార్గంలో నడిచేందుకు కార్తీక పౌర్ణమి దోహదపడుతుంది. కనుక ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోరాదు. 365 ఒత్తులతో దీపాలను తప్పక వెలిగించాలి. సూర్యోదయానికి ముందే ఇలా చేయాలి.
కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ చెట్టుకు పూజలు చేస్తే ఎంతో మంచిది. దీని గురించి శివ పురాణంలో చెప్పారు. అలాగే గోపూజ చేయాలి. దీంతోపాటు సూర్యోదయానికి ముందే నదులు లేదా సరస్సుల్లో స్నానం ఆచరించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…