Jajikaya : మనం కొన్ని రకాల వంటల తయారీలో జాజికాయను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. దీనిని వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జాజికాయ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పూర్వకాలంలో ప్రతి వంటింట్లో జాజికాయ తప్పకుండా ఉండేది. మనకు వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. జాజికాయను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జాజికాయ చేదు, వగరు రుచులను కలిగి ఉంటుంది. దీనిని నుండి నూనెను కూడా తయారు చేస్తారు. జాజికాయ చక్కని సువాసనను కలిగి ఉంటుంది. జాజికాయ వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. వాత, కఫ రోగాలను నయం చేయడంలో జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటి పూతను, ఉబ్బు రోగాన్ని, క్రిమి రోగాన్ని తగ్గించడంలో జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. జాజికాయను పాలతో అరగదీసి ఆ గంధాన్ని పై పూతగా రాయడం వల్ల నోటి పూత తగ్గుతుంది. మలేరియా జ్వరాన్ని తగ్గించడంలో కూడా జాజికాయ ఉపయోగపడుతుంది. మలేరియా జ్వరంతో బాధపడే వారు ఉదయం పరగడుపున 10 గ్రా. ల పటిక బెల్లాన్ని చప్పరించి, ఆ తరువాత 2 గ్రా. జాజికాయ కొద్ది కొద్దిగా నములుతూ మింగాలి. ఇలా చేసిన అర గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా చేయడం వల్ల మలేరియా జ్వరం తగ్గుతుంది.
జాజికాయను ఆవు నెయ్యితో అరగదీసి ఆ గంధాన్ని కంటిరెప్పలపై రాసి పడుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. జాజికాయను బియ్యం కలిపిన నీటితో అరగదీసి ఆ గంధాన్ని రెండు నుండి మూడు గ్రాముల మోతాదులో అదే బియ్యం కడిగిన నీటితో కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. జాజికాయ పొడిని, ఆవు నెయ్యితో కలిపి పై పూతగా రాయడం వల్ల పుండ్లు తగ్గుతాయి. జాజికాయను, అక్కలకర్రను, జాపత్రిని, చిన్న యాలకులను, లవంగాలు, నాగకేసరాలను ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకుని దంచి పొడి చేసుకోవాలి. దీనిలో 3 గ్రా. పచ్చకర్పూరాన్ని కలిపి ఆ మొత్తం చూర్ణాన్ని తమలపాకు రసంతో కలిపి నూరి శనగ గింజల పరిమాణంలో మాత్రలుగా చేసి నీడకు ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను రోజుకు రెండు లేదా మూడు పూటలా కండచక్కెరతో కలిపి తీసుకున్న తరువాత పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతిని సంతరించుకుంటుంది. ఈ విధంగా చేయడం వల్ల పురుషులల్లో వీర్య వృద్ధి, వీర్య స్తంభన కలుగుతుంది.
5 లేదా 6 చిటికెల జాజికాయ పొడిని మేక పాలతో అరగదీసి ఆ గంధాన్ని అర కప్పు మేక పాలతో కలిపి తీసుకుంటే గర్భస్రావం కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జాజికాయ పొడిని, పసుపును, నెయ్యిని సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పెదవులపై లేపనంగా రాస్తూ ఉంటే పెదవుల పగుళ్లు తగ్గుతాయి. జాజికాయ పొడిని, దోరగా వేయించిన చలువ మిరియాల పొడిని సమపాళ్లలో కలిపి నిల్వ చేసుకోవాలి. దీంతో రోజూ దంతాలను శుభ్రం చేసుకుంటే కదిలే దంతాలు గట్టిపడతాయి.
జాజికాయల పొడి 10 గ్రాములు, హారతి కర్పూరం పొడి 2 గ్రాములు, పుదీనా పువ్వు ఒక గ్రాము, వాము పువ్వు అర గ్రాము మోతాదులో తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని పూటకు ఒక గ్రాము మోతాదులో మంచి నీటితో కలిపి మూడు పూటలా తీసుకుంటే తలనొప్పి, జలుబు వంటివి తగ్గుతాయి. జాజికాయను మంచి నీటితో కలిపి అరగదీసి ఆ గంధాన్ని నుదుటిపై రాయడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది. ఈ విధంగా జాజికాయను ఉపయోగించి మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని, దీనిని తప్పకుండా వంటగదిలో ఉంచుకోవాలని.. నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…