Chair : మన ఇళ్లలో ఉండే పురాతన వస్తువులను ఎందుకూ పనికి రావని పడేస్తుంటాం. లేదా వీలుంటే పాత ఇనుప సామాను వాళ్లకు అమ్మేస్తుంటాం. అయితే అలాంటి వస్తువులే కొన్ని సార్లు అత్యంత విలువైన వస్తువులుగా మారుతుంటాయి. కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. సరిగ్గా ఆ మహిళకు కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
యూకేలోని ఈస్ట్ సస్సెక్స్ ప్రాంతం బ్రైటాన్కు చెందిన ఓ మహిళ ఓ పాత కుర్చీని 5 పౌండ్లకు (సుమారుగా రూ.500)కు కొనుగోలు చేసింది. స్క్రాప్ దుకాణంలో ఆమె ఆ కుర్చీని కొన్నది. తరువాత దాన్ని ఇంటికి తెచ్చుకుంది. అయితే ఆ కుర్చీ గురించి అసలు విషయం తెలుసుకున్న ఆమె దాన్ని వేలంలో పెట్టగా.. దానికి ఏకంగా 16,250 పౌండ్లు (దాదాపుగా రూ.16.4 లక్షలు) వచ్చాయి. దీంతో ఆమె ఆనందానికి గురైంది.
వాస్తవానికి ఆ కుర్చీ ఇప్పటిది కాదు. 1902 కాలం నాటిది. దాన్ని అప్పట్లో ఆస్ట్రియన్ పెయింటర్ కొలొమన్ మోజర్ డిజైన్ చేశాడు. తరువాత ఆ కుర్చీ చేతులు మారుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు తిరిగి ఆస్ట్రియాకు చెందిన ఓ వ్యక్తే దాన్ని వేలంలో కొనుగోలు చేశాడు. అంతటి పురాతనమైన కుర్చీ మళ్లీ తమ దేశానికే తిరిగి రావడం ఆనందంగా ఉందని దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి తెలిపాడు. ఏది ఏమైనా ఆ కుర్చీ వల్ల ఇరు వర్గాల వారికి ఎంతో లాభం జరిగిందని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…