Nagarjuna : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత అనేక వార్తలు హల్ చల్ చేశాయి. వారిద్దరూ విడాకులు తీసుకునేందుకు కారణాలు ఇవే.. అంటూ చాలా మంది రక రకాల వార్తలను ప్రచారం చేశారు. అయితే ఇప్పటికీ అలాంటి వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా నాగార్జున మాట్లాడినట్లుగా చెబుతున్న కొన్ని వార్తలు మళ్లీ వైరల్ అయ్యాయి.
అయితే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చానంటూ కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయని.. వాటిల్లో ఎంతమాత్రం నిజం లేదని.. దయచేసి మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయాలి.. అంటూ నాగార్జున కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
సమంతే నాగచైతన్యను ముందుగా విడాకులు అడిగిందని.. అందుకు నాగచైతన్య ఒప్పుకున్నాడని.. అయితే తన తండ్రి ఏమైనా అనుకుంటారేమోనని, కుటుంబ గౌరవం, ప్రతిష్ట ఏమవుతుందోనని తన తండ్రి ఫీలవుతారని చెప్పి నాగచైతన్య ఆలోచించాడని.. నాగార్జున చెప్పినట్లు కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవన్నీ పుకార్లే అని నాగార్జున కొట్టి పారేశారు. తాను ఆ మాటలను ఎక్కడా మాట్లాడలేదన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…