Virata Parvam : వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. విరాట పర్వం. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. మరోవైపు రానా సొంత బ్యానర్పై నిర్మించిన మూవీ. అయినప్పటికీ ఈ చిత్రం అనేక సార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశ పరిచింది. అసలే ప్రేక్షకులు థియేటర్లకు రాక చిత్ర పరిశ్రమ ఇబ్బందులకు గురవుతుంటే.. హీరోయిన్లు చేసే కామెంట్లు వివాదాస్పదం అవుతూ సినిమాకు మైనస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సాయి పల్లవి కూడా అలాగే చేసింది.
విరాట పర్వం సినిమా రిలీజ్ సమయంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఓ వర్గాన్ని మరింత రెచ్చగొట్టాయి. దీంతో సినిమాపై ఈ వివాదం ప్రభావం పడింది. ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న సాయి పల్లవి మొదటిసారిగా వివాదంలో చిక్కుకుని సారీ చెప్పింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో దీన్ని ఓటీటీలో అయినా త్వరగా రిలీజ్ చేసి నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నారు. అందుకనే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విరాట పర్వం సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
విరాట పర్వం సినిమాకు గాను డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ పొందింది. రూ.15 కోట్లకు ఈ హక్కును నెట్ఫ్లిక్స్ కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే ఇంత త్వరగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఓ వైపు నిర్మాతలు అందరూ చర్చించుకుని ఏ మూవీ అయినా సరే రిలీజ్ అయ్యాక 50 రోజుల తరువాతే ఓటీటీలో రావాలని చూసేందుకు యత్నిస్తున్నారు. కానీ విరాట పర్వం మాత్రం చాలా త్వరగా కనీసం నెల కాక ముందే ఓటీటీలోకి వస్తోంది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక విరాట పర్వం సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేతా పేతురాజ్లు పలు ఇతర పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…