Viral Video : ప్రమాదాలు సంభవించే సమయంలో చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. దీంతో ఆ ప్రమాదాల నుంచి ఎలాంటి నష్టం లేకుండా బయట పడేందుకు వీలుంటుంది. అవును.. ఆ మహిళ కూడా సరిగ్గా ఇలాగే చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న షిరూర్ అనే ఆగ్రో టూరిజం సెంటర్ నుంచి ఓ మినీ బస్సు వస్తోంది. అయితే మార్గ మధ్యలో ఆ బస్సు డ్రైవర్కు ఫిట్స్ వచ్చాయి. దీంతో అతను బస్సును అడ్డ దిడ్డంగా పోనివ్వసాగాడు. ఈ క్రమంలో బస్సులో ఉన్న మహిళలు, పిల్లలు తీవ్రంగా భయపడ్డారు. అయితే అప్పుడే 42 ఏళ్ల యోగితా సతవ్ అనే మహిళ చాకచక్యంగా వ్యవహరించింది.
సదరు డ్రైవర్ను సీట్ నుంచి తీసి పక్కన పడుకోబెట్టి వెంటనే స్టీరింగ్ అందుకుంది. తనకు కార్ నడిపిన అనుభవం ఉంది. దీంతో ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆ మినీ బస్సును పరుగెత్తించింది. అలా ఆమె ఆ బస్సును సుమారుగా 10 కిలోమీటర్ల దూరం నడుపుతూ వచ్చి ఆ డ్రైవర్ను హాస్పిటల్లో చేర్పించింది. అనంతరం ఆ బస్సులో ఉన్నవారి తమ తమ ఇళ్ల వద్ద దింపేసింది.
కాగా ఆ మహిళ బస్సు నడుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. అందరూ ఆమె ధైర్యానికి, సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని ఆమెను నెటిజన్లు అభినందిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…