Viral Video : ప్రమాదాలు సంభవించే సమయంలో చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. దీంతో ఆ ప్రమాదాల నుంచి ఎలాంటి నష్టం లేకుండా బయట పడేందుకు వీలుంటుంది. అవును.. ఆ మహిళ కూడా సరిగ్గా ఇలాగే చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న షిరూర్ అనే ఆగ్రో టూరిజం సెంటర్ నుంచి ఓ మినీ బస్సు వస్తోంది. అయితే మార్గ మధ్యలో ఆ బస్సు డ్రైవర్కు ఫిట్స్ వచ్చాయి. దీంతో అతను బస్సును అడ్డ దిడ్డంగా పోనివ్వసాగాడు. ఈ క్రమంలో బస్సులో ఉన్న మహిళలు, పిల్లలు తీవ్రంగా భయపడ్డారు. అయితే అప్పుడే 42 ఏళ్ల యోగితా సతవ్ అనే మహిళ చాకచక్యంగా వ్యవహరించింది.
సదరు డ్రైవర్ను సీట్ నుంచి తీసి పక్కన పడుకోబెట్టి వెంటనే స్టీరింగ్ అందుకుంది. తనకు కార్ నడిపిన అనుభవం ఉంది. దీంతో ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆ మినీ బస్సును పరుగెత్తించింది. అలా ఆమె ఆ బస్సును సుమారుగా 10 కిలోమీటర్ల దూరం నడుపుతూ వచ్చి ఆ డ్రైవర్ను హాస్పిటల్లో చేర్పించింది. అనంతరం ఆ బస్సులో ఉన్నవారి తమ తమ ఇళ్ల వద్ద దింపేసింది.
కాగా ఆ మహిళ బస్సు నడుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. అందరూ ఆమె ధైర్యానికి, సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని ఆమెను నెటిజన్లు అభినందిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…