News : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన నలుగురు స్నేహితులతో కలిసి తన భార్య (32)ను సిగరెట్లతో కాల్చాడు. అంతటితో ఆగకుండా వారు ఐదుగురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
చత్తీస్గఢ్కు చెందిన ఆ మహిళ ఇండోర్కు చెందిన వ్యక్తిని కొంత కాలం కిందట పెళ్లి చేసుకుంది. ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఇద్దరికీ పరిచయం కాగా వారు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వ్యక్తికి అంతకు ముందే వివాహం అయిందని పోలీసులు తెలిపారు.
కాగా ఇండోర్లోని శిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆ వ్యక్తి ఫామ్ హౌస్కు తన భార్యను తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అతనికి చెందిన నలుగురు స్నేహితులు అక్కడికి వచ్చారు. వారందరూ కలిసి ఆ మహిళను సిగరెట్లతో కాల్చారు. ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనతో అసహజ రీతిలో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నారని.. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఆ ఫామ్ హౌస్ నుంచి ఎలాగో తప్పించుకుని బయట పడిన ఆమె చత్తీస్ గఢ్లోని తన పుట్టింటికి వెళ్లింది. ఆమె భర్తకు చెందిన ఒక స్నేహితుడు ఆమెను అక్కడి వరకు ఫాలో అయ్యాడు. అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమె భర్తను, అతని నలుగురు స్నేహితులను చత్తీస్గడ్, ఇండోర్లలో భిన్న ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…