Viral Video : సాధారణంగా చాలా మందిలో అంతర్గతంగా ఏదో ఒక కళ దాగి ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో బయట పడుతుంటుంది. ఇక అలాంటి కళల్లో డ్యాన్స్ ఒకటి. దీన్ని సాధారణంగా చాలా మంది చేస్తారు. కొందరికి పుట్టుకతోనే ఈ కళ వస్తుంది. కొందరు డ్యాన్స్ నేర్చుకుని అందులో నిష్ణాతులవుతారు. ఇక కొందరు అప్పుడప్పుడు సరదాగా చేసినా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తుంటారు. అయితే ఇలా చాలా మంది రకరకాలుగా డ్యాన్స్లు చేయడాన్ని మనం చూశాం. కానీ ఓ మహిళ మాత్రం చూసే వారికి భయం పుట్టేలా డ్యాన్స్ చేసింది. అవును.. కావాలంటే.. కింద ఇచ్చిన వీడియోను చూడండి.
ఓ మహిళ అందరి ఎదుట ఉన్నట్లుండి సడెన్గా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. అయితే పెద్దగా అరుస్తూ భయపడినట్లు ఆమె డ్యాన్స్ చేయసాగింది. కింద పడుతూ లేస్తూ డ్యాన్స్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. దాన్ని డ్యాన్స్ అనరు. పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. దీంతో చుట్టూ ఉన్నవారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అందరూ ఆమెను చూసి చాలా భయపడ్డారు. వెన్నులో వణుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే ఆ మహిళ అలా డ్యాన్స్ చేయడాన్ని చూసి నెటిజన్లు సైతం తాము భయపడిపోయామని కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇది డ్యాన్సేనా.. దీన్ని డ్యాన్స్ అంటారా.. చూసేవారికి వణుకు పుట్టించేలా.. ఈ డ్యాన్స్ ఏమిటి తల్లీ.. అని నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో వారి కామెంట్లను కూడా అందరూ ఆసక్తిగా చదువుతున్నారు. ఏది ఏమైనా.. ఆ మహిళ చేసిన డ్యాన్స్కు దెబ్బకు అందరూ హడలెత్తిపోయారు..!
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…