Samantha Naga Chaitanya : నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని ఎవరూ కూడా ఊహించి ఉండరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోవడం అభిమానులని చాలా బాధిస్తోంది. అప్పటి వరకు ఎంతో ఆన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారిద్దరూ ఉన్నట్లుండి విడిపోతున్నామంటూ ప్రకటించడంపై ఫ్యాన్స్ సహా సినీ లోకం ఆశ్చర్యపోయింది. అయితే వారిద్దరరూ ఎందుకు విడిపోతున్నారో ఎక్కడా బయటకు చెప్పలేదు. విడిపోయిన తర్వాత ఇద్దరూ వారి వారి లైఫ్లను లీడ్ చేస్తున్నారు. ఎక్కడా ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోలేదు. ఎవరిపని వారి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
విడిపోయిన సమంత, నాగ చైతన్య వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. లవ్స్టోరీ, బంగార్రాజు సినిమాలతో నాలుగు నెలల గ్యాప్లోనే రెండు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాడు నాగ చైతన్య. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థాంక్యూ, లాల్ సింగ్ చద్ధా.. సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉండగా నాగచైతన్య మరో ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. సమంతతో ఓ బేబీ చిత్రాన్ని తెరకెక్కించిన నందిని రెడ్డి దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. అందులో కథానాయికగా సమంతని అనుకున్నారు.
కానీ వీళ్ళీద్దరు విడాకులు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్కు పోస్ట్ పోన్ అయింది. అయితే నాగచైతన్యలను, సమంతలను ఒప్పించే పనిలో ఉన్నారని సమాచారం. చైతూ వైపు నుంచి సానుకూల స్పందన ఉందని, సమంతని ఒప్పించే పనిలో నందినిరెడ్డి గట్టి ప్రయత్నం చేస్తుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతోగానీ ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవడంతోపాటు హాట్ టాపిక్గానూ మారింది. ఇది జరిగితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. చైతూ, సమంత కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో నటించారు. ఏం మాయ చేశావె, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ.. సినిమాలు చేశారు. మ్యారేజ్ తర్వాత మజిలీలో నటించారు. ఈ సినిమాతో సూపర్ హిట్ని అందుకున్నారు. మరోవైపు ఓ బేబీలో సమంత కీరోల్ చేయగా.. నాగచైతన్య గెస్ట్ రోల్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…