Bhagyashree : రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన అలనాటి హీరోయిన్ భాగ్య శ్రీ. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన భాగ్యశ్రీ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 32 ఏళ్ల క్రితం మైనే ప్యార్ కియాతో మెరిసిన ఆ మెరుపు మళ్లీ ఇప్పుడు తళుక్కుమంది. అది కూడా 53 ఏళ్ల ప్రాయం వచ్చినా.. చెక్కుచెదరని శరీర సౌష్టవం, అందమైన సొగసుతో కనిపిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యంగా జీవించడం బరువు తగ్గడంలో ముఖ్యమైన భాగం. అయితే బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారాన్ని అనుసరించే విషయానికి వస్తే, మనలో చాలా మందికి ఏమి తినాలో తెలియక తికమక పడుతుంటారు. వారికి భాగ్య శ్రీ పలు చిట్కాలు అందించింది.
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా ? అయితే వాటర్ వెజిటేబుల్స్ తినండి. మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. మన శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడానికి నీటి ప్రాధాన్యత చాలా ఉంది. నీటి ద్వారా ట్యాక్సిన్స్ తొలగించబడతాయి. నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పొట్లకాయ, బచ్చలికూర, టొమాటో, క్యాబేజీ, దోసకాయ, పాలకూర, గుమ్మడికాయ వంటి కూరగాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయల్లో డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు దోహదపడతాయి. ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.. అని పేర్కొంది.
డైట్లో ఉన్నవారికి లేదా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇవి సరైన కూరగాయలు అని భాగ్య శ్రీ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది. వారంలో ఏడు కూరగాయలను రోజుకు ఒకటి చొప్పున వండుకుని తింటే ఆరోగ్యానికీ మంచిది.. అందంగానూ ఉంటారు.. అని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్తో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 80, 90లలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ వెలుగు వెలిగిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. రాధేశ్యామ్లో ప్రభాస్కు తల్లి పాత్రతో ఆమె మళ్లీ వెండితెరపై అలరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా భాగ్యశ్రీ ప్రస్తుతం బాలీవుడ్లో అన్నీ పాత కథలు, కాపీ స్క్రీప్ట్స్ వస్తున్నాయని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…