Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. తన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతోపాటు తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో మహోన్నత వ్యక్తిగా పేరుపొందారు. సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు పలు యాడ్స్లో నటిస్తూ ఉన్నారు. ఆయన తాజాగా శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాడిసర్గా ఉన్నారు. పుష్ప చిత్రంతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చేరిన జీనియస్ దర్శకుడు సుకుమార్ గారి దర్శకత్వంలో, నట శిఖరం చిరంజీవి ఈ యాడ్ కోసం పని చేశారు. తాజాగా ఈ యాడ్కి సంబంధించిన ఫొటోలు విడుదల చేయగా, ఇప్పుడు వీడియో విడుదలైంది.
యాడ్ లో మెగాస్టార్ తో పాటు ఖుష్బు, అనసూయ భరద్వాజ్ కనిపించగా, ఒక మంచి ట్విస్ట్ తో హ్యాపీ న్యూస్ ను రెవీల్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ యాడ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. యాడ్లో చిరంజీవి అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఫోన్ కాల్ వస్తుంది. తన ఫ్రెండ్ గౌతమి ఫోన్ చేసిందని ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరుతాడు చిరు. అయితే, ఇంత హడావిడి ఎందుకని రేఖ (ఖుష్బు) అనుమానపడుతుంది. ఆ అనుమానంతోనే ఆటోలో చిరుని ఫాలో అవుతూ వెళుతుంది.
చిరంజీవి శుభగృహ ఆఫీసుకు వెళ్లగా.. అక్కడ అనసూయ ఇంత లేట్ అయిందని అనడం, ఆ తర్వాత స్లిప్ కాబోగా.. చిరంజీవి పట్టుకోవడం, కోపంతో రేఖ కర్ర పట్టుకోవడం జరిగిపోతాయి. కట్ చేస్తే ఈ రోజు తన భార్య రేఖ పుట్టిన రోజని, సొంతిల్లు తన కల అని, అది సాకారం ఈ రోజు చేయాలనుకుంటున్నానని చిరు చెప్తాడు. శుభ గృహ వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన ఇంటిపత్రాలను తన భార్య రేఖ బర్త్ డే సందర్భంగా చిరు అందజేస్తాడు. అలా యాడ్ ముగుస్తుంది. మొత్తానికి యాడ్ని కాస్త డిఫరెంట్గా తీశారని చెప్పొచ్చు. చిరంజీవిపై ఖుష్బూకి అనుమానం కలిగేలా చేయడం, అనసూయతో చిరు ఏదో వ్యవహరం నడుపుతున్నాడనే ఆలోచన కలిగించడం.. కాస్త ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలోనే ఈ యాడ్ వైరల్గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…