Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. తన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతోపాటు తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో మహోన్నత వ్యక్తిగా పేరుపొందారు. సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు పలు యాడ్స్లో నటిస్తూ ఉన్నారు. ఆయన తాజాగా శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాడిసర్గా ఉన్నారు. పుష్ప చిత్రంతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చేరిన జీనియస్ దర్శకుడు సుకుమార్ గారి దర్శకత్వంలో, నట శిఖరం చిరంజీవి ఈ యాడ్ కోసం పని చేశారు. తాజాగా ఈ యాడ్కి సంబంధించిన ఫొటోలు విడుదల చేయగా, ఇప్పుడు వీడియో విడుదలైంది.
యాడ్ లో మెగాస్టార్ తో పాటు ఖుష్బు, అనసూయ భరద్వాజ్ కనిపించగా, ఒక మంచి ట్విస్ట్ తో హ్యాపీ న్యూస్ ను రెవీల్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ యాడ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. యాడ్లో చిరంజీవి అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఫోన్ కాల్ వస్తుంది. తన ఫ్రెండ్ గౌతమి ఫోన్ చేసిందని ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరుతాడు చిరు. అయితే, ఇంత హడావిడి ఎందుకని రేఖ (ఖుష్బు) అనుమానపడుతుంది. ఆ అనుమానంతోనే ఆటోలో చిరుని ఫాలో అవుతూ వెళుతుంది.
చిరంజీవి శుభగృహ ఆఫీసుకు వెళ్లగా.. అక్కడ అనసూయ ఇంత లేట్ అయిందని అనడం, ఆ తర్వాత స్లిప్ కాబోగా.. చిరంజీవి పట్టుకోవడం, కోపంతో రేఖ కర్ర పట్టుకోవడం జరిగిపోతాయి. కట్ చేస్తే ఈ రోజు తన భార్య రేఖ పుట్టిన రోజని, సొంతిల్లు తన కల అని, అది సాకారం ఈ రోజు చేయాలనుకుంటున్నానని చిరు చెప్తాడు. శుభ గృహ వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన ఇంటిపత్రాలను తన భార్య రేఖ బర్త్ డే సందర్భంగా చిరు అందజేస్తాడు. అలా యాడ్ ముగుస్తుంది. మొత్తానికి యాడ్ని కాస్త డిఫరెంట్గా తీశారని చెప్పొచ్చు. చిరంజీవిపై ఖుష్బూకి అనుమానం కలిగేలా చేయడం, అనసూయతో చిరు ఏదో వ్యవహరం నడుపుతున్నాడనే ఆలోచన కలిగించడం.. కాస్త ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలోనే ఈ యాడ్ వైరల్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…