Viral News : వర్షాకాలంలో సహజంగానే క్రిమి కీటకాలు, పురుగులు, పాములు వంటివి బయటకు వస్తుంటాయి. వాతావరణం చల్లబడుతుంది కనుక అవి పుట్టల్లో, భూమిలో దాక్కుని ఉన్నప్పటికీ ఈ సీజన్లో బయటకు వస్తుంటాయి. అయితే పాములు కుడితే వెంటనే బాధితులను హాస్పిటల్కు తరలిస్తారు. అక్కడ బాధితులకు వైద్యులు చికిత్సను అందించి ప్రాణాలను కాపాడుతారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ప్రవర్తించాడు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ సిటీకి సమీపంలో ఉన్న మఖి పోలీస్ సర్కిల్ పరిధిలోని అఫ్జల్ నగర్లో రామేంద్ర యాదవ్ అనే వ్యక్తి భార్యను పాము కాటు వేసింది. దీంతో ఆ వ్యక్తి వెంటనే భార్యను హాస్పిటల్కు తరలించాడు. అయితే చిత్రం ఏమిటంటే.. ఆమెతోపాటు ఆ పామును కూడా అతను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. దీంతో అందరూ అతన్ని వింతగా చూశారు.
ఇక హాస్పిటల్లో అతని భార్యకు వైద్యులు చికిత్సను అందించి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించారు. అయితే పామును ఎందుకు తెచ్చావని అడగ్గా.. అందుకు అతను బదులిస్తూ.. ఏ పాము కాటు వేసిందో తెలిస్తే ఇంకా సులభంగా చికిత్సను అందించవచ్చు కదా.. అందుకనే పామును కూడా తెచ్చా.. అంటూ సమాధానం చెప్పాడు. దీంతో అవాక్కవ్వడం వైద్యుల వంతైంది. ఇక ఆ పామును అతను ఒక ప్లాస్టిక్ బాటిల్లో బంధించి తేగా.. దానికి రంధ్రాలు కూడా చేశాడు. పాము శ్వాస పీల్చుకునేందుకు అని అతను ఆ బాటిల్కు రంధ్రాలు పెట్టాడు. తన భార్య డిశ్చార్జి కాగానే ఆ పామును అడవిలో విడిచి పెడతానని అతను స్పష్టం చేశాడు. ఇక ఆ వ్యక్తి చేసిన పనిని చూసి చుట్టు పక్కల ఉన్నవారు కూడా విస్తుపోయారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…