Venu Swamy : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అఫిషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తున్నాడు బాలయ్య. అయితే ఆదిత్య 369 సీక్వెల్ ను మోక్షజ్ఞతో తెరకెక్కిస్తానని.. కుదిరితే దానికి నేనే దర్శకత్వం వహిస్తానని ఇటీవల బాలయ్య అన్నాడు.
కానీ తర్వాత ఎప్పటిలాగే క్రిష్, బోయపాటి, కొరటాల, రాజమౌళి పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం మోక్షజ్ఞలో హీరోకి ఉండాల్సిన లుక్ కనిపించడం లేదు. దీంతో నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు. సెలెబ్రిటీల భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా మోక్షజ్ఞ కెరీర్ పై హాట్ కామెంట్స్ చేశారు. సినిమాల్లోకి లేటుగా ఎంట్రీ ఇస్తారని వేణుస్వామి అన్నారు. లేటుగా ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడని జాతకం చెప్పారు.
మోక్షజ్ఞ జాతకం ప్రకారం సినీరంగంలో, కళారంగంలో అతడికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. నందమూరి వారసుడు అంటే రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. రాజకీయాల విషయానికి వస్తే మోక్షజ్ఞకి పాలిటిక్స్ సాధ్యం కాదు అంటూ వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నందమూరి అభిమానులు మాత్రం ముందు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే చాలు.. రాజకీయాలు తర్వాత చూసుకోవచ్చు అంటున్నారు. వేణుస్వామి ఇంతకు ముందు నాగ చైతన్య, సమంత విడాకుల విషయం, అలాగే జూ.ఎన్టీఆర్ కి రాజయోగం ఉందని కూడా చెప్పారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…