Samantha : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకు, షూటింగ్ లకు దూరంగా ఉన్న సమంత ఎక్కడుంది, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇటీవలే సామ్ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె హైదరాబాద్లో మాత్రం లేదు.
సామ్ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతోందని, అందుకే అమెరికా వెళ్లిందని పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొన్ని పూజలు, హోమాలు చేసింది, వాటి ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ సమంత టీమ్ మాత్రం అవన్నీ కేవలం రూమర్ అని ఖండిస్తూనే ఉంది. అయితే అసలు ఏం జరుగుతోందన్న దానిపై క్లారిటీ లేదు. సమంత నటించిన 2 సినిమాలు.. యశోద మరియు శాకుంతలం షూటింగ్ పూర్తి కావస్తున్నా విడుదల తేదీలను ప్రకటించలేదు.
నవంబర్ లో విడుదల కావాల్సిన శాకుంతలం 3డి కారణంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. యశోద డబ్బింగ్ పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం కోయంబత్తూర్ లోని సద్గురు ఇషా ఫౌండేషన్లో ఉందని సమాచారం. కొంత సాంత్వన మరియు మనశ్శాంతి కోసం ఆమె అక్కడికి వెళ్లిందని అంటున్నారు. ఈ నెల 10న ఆమె తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యశోద విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే సమంత ఖుషి షూటింగ్ లో పాల్గొననుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…