Life Tips : సాధారణంగా జంటలు పెళ్లికి ముందు ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ వాళ్ల ధ్యాసలోనే గడిపేస్తుంటారు. నిజానికి ఒకరితో ప్రేమలో పడేది కూడా వాళ్లు మనపై చూపించే కేర్ ను చూసే. కానీ పెళ్లి తరువాత చాలా జంటలు తమ జీవిత భాగస్వాములు మారిపోయారంటూ గొడవలు పడుతుంటారు. కొంతమంది అయితే ఏకంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. అయితే అలా జరగకుండా ఉండాలన్నా.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోవద్దని అనుకున్నా.. అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. నిపుణులు వీటిని చెబుతున్నారు. అవేమిటంటే..
ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒకరికొకరు ప్రేమతో గుడ్ మార్నింగ్ లాంటివి చెప్పుకోవాలి. అంతేకాకుండా కలిసి టీ తాగడం, టిఫిన్ చేయడం లాంటివి చేయడంతో రోజు ప్రారంభమవుతుంది. అలా కలిసి ఉదయాన్నే టీ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. భార్యాభర్తలు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కలిసి టీవీ చూడడం, సినిమాలు చూడటం లాంటివి చేయడం వల్ల ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడిపినట్టు అవుతుంది. దాని వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.
ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అనిపించినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది. భార్యకు భర్త ఇంటి పనుల్లో సాయం చేయడం, అదేవిధంగా భర్త ఆఫీసుకు వెళ్లే సమయంలో భార్య అతడి దుస్తులను ఇస్త్రీ చేయించడం లాంటివి చేయటం వల్ల ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ పెరుగుతుంది. ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడంతోపాటు ఒకరి ఇష్టాలను మరొకరు కాదనకపోవడం, కలసి బయటకు వెళ్లడం, సరదాగా విహరించడం.. వంటివి చేస్తే దంపతుల మధ్య కచ్చితంగా ప్రేమ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారని అంటున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…