Life Tips : సాధారణంగా జంటలు పెళ్లికి ముందు ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ వాళ్ల ధ్యాసలోనే గడిపేస్తుంటారు. నిజానికి ఒకరితో ప్రేమలో పడేది కూడా వాళ్లు మనపై చూపించే కేర్ ను చూసే. కానీ పెళ్లి తరువాత చాలా జంటలు తమ జీవిత భాగస్వాములు మారిపోయారంటూ గొడవలు పడుతుంటారు. కొంతమంది అయితే ఏకంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. అయితే అలా జరగకుండా ఉండాలన్నా.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోవద్దని అనుకున్నా.. అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. నిపుణులు వీటిని చెబుతున్నారు. అవేమిటంటే..
ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒకరికొకరు ప్రేమతో గుడ్ మార్నింగ్ లాంటివి చెప్పుకోవాలి. అంతేకాకుండా కలిసి టీ తాగడం, టిఫిన్ చేయడం లాంటివి చేయడంతో రోజు ప్రారంభమవుతుంది. అలా కలిసి ఉదయాన్నే టీ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. భార్యాభర్తలు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కలిసి టీవీ చూడడం, సినిమాలు చూడటం లాంటివి చేయడం వల్ల ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడిపినట్టు అవుతుంది. దాని వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.
ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అనిపించినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది. భార్యకు భర్త ఇంటి పనుల్లో సాయం చేయడం, అదేవిధంగా భర్త ఆఫీసుకు వెళ్లే సమయంలో భార్య అతడి దుస్తులను ఇస్త్రీ చేయించడం లాంటివి చేయటం వల్ల ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ పెరుగుతుంది. ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడంతోపాటు ఒకరి ఇష్టాలను మరొకరు కాదనకపోవడం, కలసి బయటకు వెళ్లడం, సరదాగా విహరించడం.. వంటివి చేస్తే దంపతుల మధ్య కచ్చితంగా ప్రేమ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారని అంటున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…