Upasana Konidela : మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కోడలిగా ఇంటి బాధ్యతలను, రామ్ చరణ్ వ్యాపారాలను చూసుకుంటున్న ఆమె మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా చూసుకుంటూ ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇక అన్ని విధాలుగా ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ ఉపాసన మాత్రం సోషల్ మీడియాలో అందరికీ చేరువగానే ఉంటారు. అలాగే తనకు తెలిసిన వాళ్ల ఇండ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా వెళ్తుంటారు.
అయితే ఉపాసన, రాంచరణ్ ల వివాహం అయి 10 సంవత్సరాలు గడిచాయి. ఉపాసన సొసైటీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఇంకా పిల్లలు లేరనే మాటలు వింటూ ఎంతో బాధకు గురవుతుంటారు. ఎన్నోసార్లు ఈ విషయంపై ప్రశ్నలు ఎదురవగా తాను పిల్లలు కనడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని సమయం వచ్చినప్పుడు తానే సమాధానం చెబుతా అంటూ దాటవేస్తూ వచ్చారు.
అయితే తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన సైతం తన డ్రైవర్ ఇంటికి గణేష్ నిమజ్జనం కోసం వెళ్లారు. అలా ఈమె గణేష్ నిమజ్జనంలో సందడి చేస్తున్న సమయంలో ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో ఉపాసన ప్రెగ్నెంటా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఉపాసన, రాంచరణ్ గణేష్ విగ్రహం పట్టుకున్నటువంటి ఫోటోలో కూడా ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది.
ఈ విధంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో భాగంగా సందడి చేసిన ఉపాసన ఒక్కసారిగా బేబీ బంప్ తో కనిపించడంతో మెగా అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉపాసనలో కూడా శారీరకంగా మార్పులు చోటు చేసుకోవడంతో ఈమె కచ్చితంగా గర్భం దాల్చిందని అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదని పలువురు భావిస్తున్నారు. అయితే ఇది నిజమైతే త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక ఈమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…