Surekha Vani : బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీమ టపాకాయ్, పవర్, సరైనోడు, నేల టిక్కెట్టు, రామారావు ఆన్ డ్యూటీ వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భర్త మరణం తర్వాత సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంది సురేఖ వాణి.
సోషల్ మీడియాలో సురేఖ వాణికి ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. కూతురు సుప్రీతతో సురేఖ వాణి చేసే సందడి నెటిజన్లను సైతం ఎంతగానో ఆకర్షిస్తుంది. తల్లీకూతుళ్లు కలిసి చేసే డాన్స్ వీడియోలు కూడా నెటిజన్లను ఫిదా చేసేస్తాయి. కొన్ని సందర్భాలలో వీరిద్దరి వస్త్రధారణ వివాదాస్పద వ్యాఖ్యలకు దారి తీస్తుంటుంది. తల్లికూతుళ్లు సోషల్ మీడియాలో చేసే హడావిడికి ఎవరైనా నెగెటివ్ కామెంట్ పెడితే వారిపై కౌంటర్ల వర్షం కురిపిస్తారు.
ప్రస్తుతం సురేఖవాణి గురించి ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు మోడ్రన్ డ్రెస్ లతో సందడి చేయడం, కలిసి పబ్బులు పార్టీలకు వెళుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రకరకాల డ్రెస్ లతో ఫుల్ రిచ్ గా మెయిటేన్ చేస్తుంటుంది సురేఖా వాణి. ఇలా రిచ్ గా మెయింటెన్ చేయడం ద్వారా సురేఖవాణి ఎంత ఆస్తి వెనకేసి ఉంటుంది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే సురేఖవాణి భారీగానే ఆస్తులు సంపాదించిందని తెలుస్తోంది. ఇక సురేఖవాణి ఈ రేంజ్ లో రిచ్ గా మెయిన్ టెయిన్ చేయడానికి కారణం సినిమాల ద్వారా రూ.10 కోట్లు వరకు సంపాదించడమేనట. సురేఖవాణి ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. సురేఖ వాణికి సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ ఉండటంతో సినిమాలకు ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా ప్రమోషన్స్ తో కూడా వీళ్ళకి అధిక ఆదాయం చేకూరుతుందట. ఎక్కువ సినిమాలు చేయకపోయినా వచ్చిన ఆఫర్లతో సంతృప్తి చెందుతూ, ఉన్న ఆస్తితో ఇప్పటివరకు తను కోల్పోయిన లైఫ్ ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుందట సురేఖ వాణి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…