Under 19 Cricket World Cup 2022 : కూలిడ్జ్ లో జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 టోర్నీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఇలా వరల్డ్ కప్ ఫైనల్స్లోకి వెళ్లడం.. అండర్ 19 జట్టుకు ఇది వరుసగా నాలుగోసారి. భారత్ నిర్దేశించిన 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా తడబడింది. ఈ క్రమంలో ఆసీస్ జట్టుపై భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత అండర్ 19 జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో కెప్టెన్ యశ్ ధుల్ సెంచరీ (110)తో కదం తొక్కాడు. మరో బ్యాట్స్మన్ షేక్ రషీద్ (94) కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జాక్ నిస్బెట్, విలియమ్ సాల్జ్మన్లు చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 194 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బ్యాట్స్మెన్లలో లచ్లన్ షా 51 పరుగులు చేయగా, కోరే మిల్లర్ 38, క్యాంప్బెల్ కెల్లావే 30 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో విక్కీ ఓస్ట్వాల్ 3 వికెట్లు పడగొట్టాడు. నిషాంత్ సింధు, రవికుమార్లు చెరో 2 వికెట్లు తీశారు. కౌశల్ తంబె, రఘువంశీలు చెరొక వికెట్ తీశారు.
కాగా ఈ మ్యాచ్లో గెలుపుతో ఫైనల్కు చేరిన భారత్ ఈ నెల 5వ తేదీన ఇంగ్లండ్తో మ్యాచ్ ఆడనుంది. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్లో మ్యాచ్ ను వీక్షించవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…