TSRTC : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సుల్లో చార్జిలను పెంచిన విషయం విదితమే. అయితే తాజాగా మరోమారు ఈ చార్జిలను పెంచారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నుంచి పెంచిన చార్జిలు అమలులోకి వస్తాయని చెప్పారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట టిక్కెట్కు రూ.2 అదనంగా వసూలు చేయనున్నారు. అలాగే ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్, ఏసీ బస్సుల్లో టిక్కెట్కు రూ.5 అదనంగా ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నారు.
డీజిల్ సెస్ పేరిట ఈ చార్జిలను పెంచి వసూలు చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్ల ధరలను ఎందుకు పెంచాల్సి వచ్చిందో సజ్జనార్ వివరించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో వినియోగించే హెచ్ఎస్డీ ఆయిల్ ధర లీటర్కు రూ.83 ఉండేదని.. కానీ ఇప్పుడు దాని ధర లీటర్కు రూ.118గా ఉందని.. ఈ ధర ఎప్పుడో పెరిగినా.. ఆర్టీసీ ఇప్పటి వరకు నష్టాలను భరిస్తూనే వస్తుందని.. అయితే ఇన్ని నష్టాలను తట్టుకోవడం కష్టంగా ఉందని.. కనుకనే చార్జిలను మరోమారు పెంచక తప్పడం లేదని సజ్జనార్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
హెచ్ఎస్డీ ఆయిల్ను ఆర్టీసీ రోజుకు 6 లక్షల లీటర్ల మేర వినియోగిస్తుందని.. అయితే ఈ ఆయిల్ ధర పెరిగినందున నష్టాలను భరించలేకే చార్జిలను పెంచాల్సి వస్తుందని అన్నారు. కాగా పెంచిన ధరలు శనివారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ సందర్బంగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…