TSRTC : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సుల్లో చార్జిలను పెంచిన విషయం విదితమే. అయితే తాజాగా మరోమారు ఈ చార్జిలను పెంచారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నుంచి పెంచిన చార్జిలు అమలులోకి వస్తాయని చెప్పారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట టిక్కెట్కు రూ.2 అదనంగా వసూలు చేయనున్నారు. అలాగే ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్, ఏసీ బస్సుల్లో టిక్కెట్కు రూ.5 అదనంగా ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నారు.
డీజిల్ సెస్ పేరిట ఈ చార్జిలను పెంచి వసూలు చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్ల ధరలను ఎందుకు పెంచాల్సి వచ్చిందో సజ్జనార్ వివరించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో వినియోగించే హెచ్ఎస్డీ ఆయిల్ ధర లీటర్కు రూ.83 ఉండేదని.. కానీ ఇప్పుడు దాని ధర లీటర్కు రూ.118గా ఉందని.. ఈ ధర ఎప్పుడో పెరిగినా.. ఆర్టీసీ ఇప్పటి వరకు నష్టాలను భరిస్తూనే వస్తుందని.. అయితే ఇన్ని నష్టాలను తట్టుకోవడం కష్టంగా ఉందని.. కనుకనే చార్జిలను మరోమారు పెంచక తప్పడం లేదని సజ్జనార్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
హెచ్ఎస్డీ ఆయిల్ను ఆర్టీసీ రోజుకు 6 లక్షల లీటర్ల మేర వినియోగిస్తుందని.. అయితే ఈ ఆయిల్ ధర పెరిగినందున నష్టాలను భరించలేకే చార్జిలను పెంచాల్సి వస్తుందని అన్నారు. కాగా పెంచిన ధరలు శనివారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ సందర్బంగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…