TSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సు చార్జిలను పెంచింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చార్జిలను పెంచుతున్నట్లు తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్కు 25 పైసలు, మిగిలిన బస్సు సర్వీసుల్లో కిలోమీటర్కు 30 పైసల చొప్పున చార్జిలను పెంచుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఎండీ సజ్జనార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందని తెలిపారు. నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించేందుకే చార్జిలను పెంచుతున్నామని తెలిపారు.
బస్సు చార్జిలను పెంచితే ప్రస్తుతం ఉన్న నష్టాల్లో కొంత మేర తగ్గే అవకాశం ఉందని మంత్రి అన్నారు. గత 3 ఏళ్ల కాలంలో ఆర్టీసీకి ఆదాయం భారీగా తగ్గిందని, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. గడిచిన 3 ఏళ్లలో ఆర్టీసీకి ఏకంగా రూ.4,260 కోట్ల మేర నష్టాలు వచ్చాయని తెలిపారు. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే ఆర్టీసీ చార్జిలను పెంచక తప్పడం లేదని స్పష్టం చేశారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.4,882 కోట్ల ఆదాయం రాగా ఖర్చు మాత్రం రూ.5,811 కోట్లు అయింది. అలాగే 2019-20 సంవత్సరంలో రూ.4,592 కోట్ల ఆదాయం రాగా, ఖర్చు రూ.5,594 కోట్లు అయింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ ఆదాయం రూ.2,455 కోట్లు ఉండగా, ఖర్చు రూ.4,784 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో చార్జిలను పెంచితే ఆర్టీసీకి ఏడాదికి రూ.850 కోట్ల మేర ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…