Trisha : చెన్నై చంద్రం త్రిష నాలుగు పదుల వయస్సులోనూ తెగ సందడి చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్లతో నానా హంగామా చేస్తోంది. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో త్రిష ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే మోహన్లాల్ హీరోగా నటిస్తోన్న ‘రామ్’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. మరోవైపు డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతోంది. ‘బృంద’ అనే తెలుగు వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇతర భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ను అనువదించనున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.
తాజాగా త్రిషకి అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్గా నిలిచారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేసింది త్రిష. ఇక ఇప్పటికే ఈ వీసాను.. ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్.. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు.
తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి నటి త్రిష. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అబుదాబి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…