Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం సెలబ్రెటీలు ఎన్నో అవస్థలు పడతారు. ఈ క్రమంలోనే ఒకసారి వారికి ఇష్టం వచ్చిన తర్వాత వారు ఎంపిక చేసుకొనే ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహిస్తూనే ఒకవైపు సినిమాలలో దూసుకుపోతూ మరోవైపు వ్యాపార రంగాలలోకి అడుగు పెడుతుంటారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఉన్న ఎంతో మంది హీరోలు ప్రస్తుతం సైడ్ బిజినెస్ లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా ట్రూజెట్ విమాన సర్వీసులను నడుపుతున్నారు. అలాగే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ ఒక పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా పబ్ నిర్వహించడమే కాకుండా ఒక మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా, ఏషియన్ మూవీస్ తో కలిసి ఏఎంబీ మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ని నడుపుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఒక క్లాత్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఒక మల్టీప్లెక్స్ ఉంది.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మరోవైపు వ్యాపార రంగంలో అడుగుపెట్టి వారు ఏంటో నిరూపించుకున్నారు. అయితే హీరోల అడుగు జాడల్లోనే హీరోయిన్స్ కూడా వ్యాపార రంగాలలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ లు పెట్టి నిర్వహిస్తుండగా.. సమంత సాకి పేరిట దుస్తుల బ్రాండ్ను నడుపుతోంది. అలాగే తమన్నా ఆభరణాల షాప్ ను నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే హీరోయిన్లు కూడా హీరోలకు పోటీగా రెండు చేతులా సంపాదిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…