Tollywood : టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. అప్పట్లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ విచారించింది. వారి నమూనాలను కూడా సేకరించింది. అప్పట్లో ఏర్పాటైన సిట్ టీమ్ నిన్న మొన్నటి వరకు ఈ కేసును విచారణ చేసింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2021లో సదరు టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆ సిట్ టీమ్ క్లీన్ చిట్ను ఇచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టింది. దీంతో ఆ సెలబ్రిటీలకు మళ్లీ గుండెల్లో గుబులు మొదలైంది.
తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన హైకోర్టు వెంటనే కేసును ఈడీకి అప్పగించింది. అలాగే తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వద్ద ఈ కేసుకు సంబంధించి ఉన్న మొత్తం ఆధారాలు, రికార్డులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలను ఈడీకి అప్పగించాలని హైకోర్టు ఆ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఆ డిపార్ట్మెంట్ వారు ఈడీకి వాటిని అప్పగించలేదు.
దీంతో ఈడీ మరోమారు హైకోర్టుకు విజ్ఞప్తి చేయగా.. ఎట్టకేలకు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సదరు రికార్డులు మొత్తాన్ని ఈడీకి అప్పగించింది. దీంతో ఈడీ ఈ కేసును తవ్వడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ కోణంలోనూ ఈ కేసును ఈడీ విచారించనుంది. దీంతో ఆయా టాలీవుడ్ సెలబ్రిటీలకు మళ్లీ గుబులు మొదలైంది. అయితే ఈడీ ఈ కేసును ఎంత మేర విచారిస్తుంది, సెలబ్రిటీల పాత్ర ఏమైనా ఉందా ? లేక మళ్లీ ఈ కేసు విచారణను అలాగే సాగదీస్తారా ? అన్న వివరాలు త్వరలో తెలియనున్నాయి..!
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…