Tollywood : టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. అప్పట్లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ విచారించింది. వారి నమూనాలను కూడా సేకరించింది. అప్పట్లో ఏర్పాటైన సిట్ టీమ్ నిన్న మొన్నటి వరకు ఈ కేసును విచారణ చేసింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2021లో సదరు టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆ సిట్ టీమ్ క్లీన్ చిట్ను ఇచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టింది. దీంతో ఆ సెలబ్రిటీలకు మళ్లీ గుండెల్లో గుబులు మొదలైంది.
తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన హైకోర్టు వెంటనే కేసును ఈడీకి అప్పగించింది. అలాగే తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వద్ద ఈ కేసుకు సంబంధించి ఉన్న మొత్తం ఆధారాలు, రికార్డులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలను ఈడీకి అప్పగించాలని హైకోర్టు ఆ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఆ డిపార్ట్మెంట్ వారు ఈడీకి వాటిని అప్పగించలేదు.
దీంతో ఈడీ మరోమారు హైకోర్టుకు విజ్ఞప్తి చేయగా.. ఎట్టకేలకు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సదరు రికార్డులు మొత్తాన్ని ఈడీకి అప్పగించింది. దీంతో ఈడీ ఈ కేసును తవ్వడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ కోణంలోనూ ఈ కేసును ఈడీ విచారించనుంది. దీంతో ఆయా టాలీవుడ్ సెలబ్రిటీలకు మళ్లీ గుబులు మొదలైంది. అయితే ఈడీ ఈ కేసును ఎంత మేర విచారిస్తుంది, సెలబ్రిటీల పాత్ర ఏమైనా ఉందా ? లేక మళ్లీ ఈ కేసు విచారణను అలాగే సాగదీస్తారా ? అన్న వివరాలు త్వరలో తెలియనున్నాయి..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…