Manchu Vishnu : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గత కొంత కాలంగా వివాదాలు నెలకొన్న విషయం విదితమే. అయితే మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ఇదే విషయమై ఏపీ సీఎం జగన్ను కలిసి చర్చించారు. ఇక తాజాగా మరోమారు ఆయన ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్స్తో కలిసి సీఎం జగన్ను కలిసి మళ్లీ ఆయా సమస్యలపై చర్చించారు. దీంతో టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడినట్లేనని భావిస్తున్నారు.
అయితే టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ను కలిసిన ఒక రోజు తరువాత ఏపీ మంత్రి పేర్ని నాని మోహన్బాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోహన్ బాబు వైసీపీ నేత. అందులో భాగంగానే ఆయనను కలిశారని అనుకోవడానికి లేదు. పైగా ఆ సమావేశంలో మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. దీంతో ఆ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే సమావేశం అనంతరం విష్ణు టాలీవుడ్ సమస్యలపై ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని తమతో చర్చించారని.. ఈ విషయంలో సంతృప్తిగా ఉందని చెబుతూ ట్వీట్ చేశారు. అయితే నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఆయన వెంటనే ఆ ట్వీట్ను డిలీట్ చేసి ఊరికే థ్యాంక్స్ చెప్పారు. దీంతో విష్ణుకు నెటిజన్ల నుంచి మరిన్ని విమర్శలు ఎదురవుతున్నాయి.
సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ మొత్తం ఒక మాట మీద నిలబడాలని చెప్పిన మోహన్ బాబు, విష్ణు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అలాగే చిరంజీవి జగన్ను కలిసేందుకు వెళ్లినప్పుడు మంచు ఫ్యామిలీ కూడా వెళ్లి ఉండవచ్చు కదా.. అందుకు వారికి కలిగిన నొప్పి ఏమిటో చెప్పాలి.. అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే ముందుగా మోహన్ బాబే ఈ సమస్యను పరిష్కరించి ఇండస్ట్రీకి పెద్ద అయి ఉండవచ్చు కదా.. అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు చేస్తున్న విమర్శలకు మంచు ఫ్యామిలీ వద్ద సమాధానం లేదని స్పష్టమవుతోంది. చిరంజీవి కన్నా తామే ముందుగా స్పందించి జగన్తో చర్చించి ఉంటే తమకే క్రెడిట్ అంతా దక్కేది కదా.. అన్న భావనలో మంచు ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ఇంకా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…