Sai Pallavi : సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో వెండితెరకి మరికొన్ని అందాల రంగులు అద్దే బాధ్యత హీరోయిన్ మీదే ఉంటుంది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్స్ ని కలిగి ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని కూడా ముద్దుగా పిలుస్తారు.
అయితే సాయి పల్లవి తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా ఆమె డాన్స్ కి కూడా అభిమానులున్నారు. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే.. నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉంటుందని కూడా ప్రశంసిస్తూ ఉంటారు. తన మొదటి తెలుగు సినిమా ఫిదా నుండి ఇటీవలి శ్యామ్ సింగరాయ్ వరకు, పల్లవి ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్తో మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. కానీ ఆమె నటన వెనుక చాలా బాధ మరియు కృషి ఉంది. సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా సాంగ్స్ పిక్చరైజేషన్ టైంలో తన పీరియడ్స్ తనను చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపింది. పీరియడ్స్ టైంలో డ్యాన్స్ చేయడం వల్ల శారీరకంగా ఉండే బాధ వర్ణనాతీతం అని పల్లవి పేర్కొంది.
షూటింగ్ సమయంలో ఆమె 2-3 రోజులు నొప్పిని భరించి, ఒకేసారి విశ్రాంతి తీసుకోవలసి వస్తుందని తెలిపింది. పల్లవి నిద్రపోతున్నప్పుడు తన తండ్రి ఆమె పాదాలకు మసాజ్ చేసేవాడని తన పెయిన్ ఫుల్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది. శ్యామ్ సింగరాయ్లోని క్లాసికల్ సాంగ్ నుంచి తన కెరీర్లో చాలా పాటలను, పీరియడ్స్లో ఉన్నప్పుడు తీయాల్సి వచ్చిందని సాయి పల్లవి వివరించింది. దీన్నిబట్టి సినిమాల పట్ల సాయి పల్లవి అంకితభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి విడుదయ్యాయి. ఈ రెండు చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…