Sai Pallavi : సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో వెండితెరకి మరికొన్ని అందాల రంగులు అద్దే బాధ్యత హీరోయిన్ మీదే ఉంటుంది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్స్ ని కలిగి ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని కూడా ముద్దుగా పిలుస్తారు.
అయితే సాయి పల్లవి తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా ఆమె డాన్స్ కి కూడా అభిమానులున్నారు. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే.. నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉంటుందని కూడా ప్రశంసిస్తూ ఉంటారు. తన మొదటి తెలుగు సినిమా ఫిదా నుండి ఇటీవలి శ్యామ్ సింగరాయ్ వరకు, పల్లవి ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్తో మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. కానీ ఆమె నటన వెనుక చాలా బాధ మరియు కృషి ఉంది. సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా సాంగ్స్ పిక్చరైజేషన్ టైంలో తన పీరియడ్స్ తనను చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపింది. పీరియడ్స్ టైంలో డ్యాన్స్ చేయడం వల్ల శారీరకంగా ఉండే బాధ వర్ణనాతీతం అని పల్లవి పేర్కొంది.
షూటింగ్ సమయంలో ఆమె 2-3 రోజులు నొప్పిని భరించి, ఒకేసారి విశ్రాంతి తీసుకోవలసి వస్తుందని తెలిపింది. పల్లవి నిద్రపోతున్నప్పుడు తన తండ్రి ఆమె పాదాలకు మసాజ్ చేసేవాడని తన పెయిన్ ఫుల్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది. శ్యామ్ సింగరాయ్లోని క్లాసికల్ సాంగ్ నుంచి తన కెరీర్లో చాలా పాటలను, పీరియడ్స్లో ఉన్నప్పుడు తీయాల్సి వచ్చిందని సాయి పల్లవి వివరించింది. దీన్నిబట్టి సినిమాల పట్ల సాయి పల్లవి అంకితభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి విడుదయ్యాయి. ఈ రెండు చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…