Allu Sirish : స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నో చిత్రాలను నిర్మాతగా తెలుగు తెరకు పరిచయం చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విజేత, రౌడీ అల్లుడు, జల్సా, 100% లవ్, సరైనోడు, గీతగోవిందం, అల వైకుంఠపురంలో వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట్ నిర్మాతగా మారాడు. ఇక రెండవ కుమారుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. అందరి కంటే చిన్న కుమారుడు శిరీష్ సైతం హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
2013లో గౌరవం చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఇతను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా దాదాపు ఆరు చిత్రాల కన్నా ఎక్కువగా నటించలేదు. నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోగా సూపర్ హిట్ సక్సెస్ ను మాత్రం అందుకోలేదు. టాలెంట్ ఉన్నా కూడా శిరీష్ కి కాలం కలసి రాలేదు. మొదట అల్లు అర్జున్ కూడా గంగోత్రి చిత్రంతో ఇతను కూడా ఒక హీరో అనే టాక్ ను అందుకున్నాడు. తర్వాత ఆర్య చిత్రంతో సక్సెస్ ను అందుకుని వరుస ఆఫర్లు చేజిక్కించుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా హోదాను సంపాదించుకున్నాడు. శిరీష్ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. శిరీష్ చివరిగా నటించిన ఎబిసిడి చిత్రం 2019 లో విడుదలైంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రేమ కాదంట ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సరైన సక్సెస్ లేని శిరీష్ చిత్రం చేయడం అనేది జరుగుతుందో లేదో అనే వార్త వినిపిస్తోంది. ఇప్పటివరకు చిత్ర యూనిట్ కూడా ఎటువంటి అప్డేట్స్ను ఇవ్వలేదు. ఈ క్రమంలో శిరీష్ తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారట. అటు తండ్రి అల్లు అరవింద్ గానీ, ఇటు అన్న అల్లు అర్జున్ గానీ తన కెరీర్ గురించి పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారట. తండ్రి అల్లు అరవింద్ అన్న అర్జున్ కెరీర్ ని ఎంతో గొప్పగా నిర్మించారు. నన్ను మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు అంటూ బాధను వ్యక్తం చేస్తున్నాడట. అల్లు అర్జున్ భవిష్యత్తుపై ఉన్న శ్రద్ధ నాపై లేదని శిరీష్ తండ్రిపైన ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది.
తండ్రి అల్లు అరవింద్ తలచుకుంటే తన కెరీర్ ను కూడా గొప్పగా నిలబెట్టగలరు. కానీ ఆయన నా గురించి శ్రద్ధ తీసుకోవడం లేదని మనోవేదనకు గురయ్యారని తెలుస్తోంది. కొంతకాలంగా శిరీష్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. కెరియర్ పరంగా మనోవ్యధ కారణంగానే శిరీష్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వార్త వినిపిస్తోంది. అంతేకాకుండా శిరీష్ కొంతకాలంగా అను ఇమ్మానియేల్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శిరీష్ కుటుంబ సభ్యులతో విడిపోయి ముంబైలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ, ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…