దేశ వ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన వజ్రమ్మ(65) అనే వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట కోవిడ్ సెంటర్ లో చేర్చారు. అయితే ఆ వృద్ధురాలు మరణించడంతో ఆస్పత్రి సిబ్బంది తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉదయమే వచ్చి శవాన్ని తీసుకు వెళ్తామని చెప్పారు.
ఉదయం వచ్చిన బంధువులు ఆస్పత్రి రాగానే ఆమె శవాన్ని అప్పగించారు. ఆ శవాన్ని అక్కడినుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఆ శవం తమ వారిది కాదని గుర్తించడంతో ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు.
అదే రోజు వీరన్నపేట గ్రామస్తులు రాకముందే అదే పేరుతో ఉన్న మరో వృద్ధురాలు మరణించింది. పొరపాటున వాళ్లు వీరన్నపేట గ్రామానికి చెందిన వజ్రమ్మ శవాన్ని సిద్దిపేట పట్టణానికి చెందిన వారికి ఇవ్వడంతో వారు ఆ శవాన్ని తీసుకెళ్లారు.
తప్పు తెలుసుకున్న అధికారులు వారికి ఫోన్ చేసి సమాచారం తెలుపుగా అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు.అయితే ప్రస్తుతం ఉన్నది వారి బంధువులు శవమే వచ్చి తీసుకెళ్లాలని ఆస్పత్రి అధికారులు చెప్పగా వారు ఫోన్ కట్ చేసే స్విచ్ ఆఫ్ చేశారు. ఈ విధంగా ఫోన్ స్విచాఫ్ చేయడంతో వారికి ఏం చేయాలో తెలియక వజ్రమ్మ శవాన్ని మార్చురీలోనే ఉంచారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా శవాలు తారుమారయ్యాయని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…