దేశ వ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన వజ్రమ్మ(65) అనే వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట కోవిడ్ సెంటర్ లో చేర్చారు. అయితే ఆ వృద్ధురాలు మరణించడంతో ఆస్పత్రి సిబ్బంది తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉదయమే వచ్చి శవాన్ని తీసుకు వెళ్తామని చెప్పారు.
ఉదయం వచ్చిన బంధువులు ఆస్పత్రి రాగానే ఆమె శవాన్ని అప్పగించారు. ఆ శవాన్ని అక్కడినుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఆ శవం తమ వారిది కాదని గుర్తించడంతో ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు.
అదే రోజు వీరన్నపేట గ్రామస్తులు రాకముందే అదే పేరుతో ఉన్న మరో వృద్ధురాలు మరణించింది. పొరపాటున వాళ్లు వీరన్నపేట గ్రామానికి చెందిన వజ్రమ్మ శవాన్ని సిద్దిపేట పట్టణానికి చెందిన వారికి ఇవ్వడంతో వారు ఆ శవాన్ని తీసుకెళ్లారు.
తప్పు తెలుసుకున్న అధికారులు వారికి ఫోన్ చేసి సమాచారం తెలుపుగా అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు.అయితే ప్రస్తుతం ఉన్నది వారి బంధువులు శవమే వచ్చి తీసుకెళ్లాలని ఆస్పత్రి అధికారులు చెప్పగా వారు ఫోన్ కట్ చేసే స్విచ్ ఆఫ్ చేశారు. ఈ విధంగా ఫోన్ స్విచాఫ్ చేయడంతో వారికి ఏం చేయాలో తెలియక వజ్రమ్మ శవాన్ని మార్చురీలోనే ఉంచారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా శవాలు తారుమారయ్యాయని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…