కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బుధవారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చించి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ అమలు కానుంది.
లాక్డౌన్లో భాగంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసరాలను కొనేందుకు అనుమతులు ఇస్తారు. ఆ సమయంలో లాక్డౌన్ సడలింపులు ఉంటాయి. ఉదయం 10 గంటలు దాటితే పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలులో ఉంటుంది. అయితే అత్యవసర సేవలు, మీడియా వంటి వారికి లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఉంటాయి.
కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఎప్పటికప్పుడు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం ఉదయం కూడా ఈ అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ అక్షింతలు వేసింది. లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆంబులెన్స్లను ఎందుకు ఆపుతున్నారు, మానవత్వం లేదా అని, ఆంబులెన్స్ చార్జిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పామని, దానిపై ఏం నిర్ణయం తీసుకున్నారని, కుంభమేళా నుంచి వచ్చిన వారిని గుర్తించారా, లేదా ? అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షంతో ముప్పు తిప్పలు పెట్టింది. ఇక మధ్యాహ్నం అనంతరం కోర్టు విచారణ మళ్లీ ప్రారంభం కానుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…