పల్లెటూరు కు చెందిన ఓ అమ్మాయి తన మధురమైన స్వరంతో పాట పాడగా ఆ పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.ఆమె గాత్రం కేవలం కేటీఆర్ ని మాత్రమే కాకుండా సంగీత దర్శకులు ఎస్.ఎస్ తమన్ దేవిశ్రీ ప్రసాద్ సైతం మంత్రముగ్ధులను చేసింది. ఆమె పాటను విన్న సంగీత దర్శకులు తాము నిర్వహించబోయే కార్యక్రమాలలో తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
మెదక్ జిల్లాకు చెందిన నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి అధ్భుత గాయని. తన అద్భుతమైన గాత్రానికి ఫిదా అయిన నెటిజన్ సరేంద్ర తిప్పరాజు ఆ వీడియోని ట్విటర్ వేదికగా కేటీఆర్కు షేర్ చేశారు. ఈ విధంగా వీడియోను షేర్ చేసిన నెటిజన్ మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆణిముత్యం ఉంది. మీ సహకారం ఆశీస్సులు తనకు కావాలని తను పాడిన పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. శ్రావణి పాడిన ఈ పాటకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్ ఆ వీడియోను సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేశారు.
ఈ పాటను విన్న సంగీత దర్శకుడు తమన్ ఆమె ఒక అద్భుతమైన గాయని అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఆమె పాటకు స్పందిస్తూ ఆమె గాత్రానికి ఫిదా అయినట్లు చెప్పడమే కాకుండా.. ఇంత ప్రతిభావంతురాలిని తమ దృష్టికి తీసుకు వచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా భవిష్యత్తులో తాను నిర్వహించబోయే కార్యక్రమాలలో తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తానని ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…