Kamareddy : వారిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ వధువుకు భర్త నుంచి చేదు అనుభవం ఎదురయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సైకోగా మారి చివరికి తన భార్య గొంతు కోసి ప్రాణాలు తీసిన ఘటన కామారెడ్డి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన సుధారాణి అనే యువతి శివయ్య పల్లి గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని గత ఎనిమిది నెలలుగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లి విషయం ఇంట్లో పెద్దవారికి చెప్పడంతో పెద్దవాళ్ళు వీరి పెళ్లికి అంగీకరించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఇలా వివాహం అనంతరం కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన సుధారాణికి అత్తారింట్లో చేదు అనుభవం ఎదురయింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనని అవమానిస్తూ వేధింపులకు గురి చేయడంతో ఈ విషయాన్ని సుధారాణి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో పెద్ద వారు ఈ విషయంపై కలగజేసుకొని వారికి సర్ది చెప్పారు. అయితే కిరణ్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో పెళ్లి తర్వాత వీరిద్దరూ ప్రగతినగర్లోని శ్రీసాయిద్వారకా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం సుధారాణి తల్లిదండ్రులను హైదరాబాద్ రావాల్సిందిగా కిరణ్ కుటుంబ సభ్యులు కోరారు.
సుధారాణి తల్లిదండ్రులు వచ్చి తలుపు తట్టగా ఎంతసేపటికీ డోర్ తీయకపోవడంతో సుధారాణి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా తీవ్రమైన రక్తస్రావంలో సుధారాణి విగతజీవిగా పడి ఉండగా.. వారి అల్లుడు కిరణ్ కుమార్ కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలా ప్రాణాలతో ఉన్న అతనిని సరైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుధారాణిని తన భర్త కూరగాయలు కోసే కత్తితో మెడ, కాళ్లు, చేతులు కోయడంతో తీవ్ర రక్తస్రావమై మరణించింది. తన కూతురిని అత్తింటి వారే చంపారంటూ సుధారాణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…