తమకు ఇష్టం ఉన్న సెలబ్రిటీలను కలిసేందుకు అభిమానులు ఎంత వరకైనా వెళ్తుంటారు. ఏ సాహసాలు అయినా చేస్తుంటారు. ఈ క్రమంలోనే భారతీయుల గుండెల్లో రియల్ లైఫ్ హీరోగా చెరగని ముద్ర వేసుకున్న సోనూ సూద్ను కలిసేందుకు కూడా ఓ అభిమాని సాహసం చేశాడు. హైదరాబాద్ నుంచి అతను ముంబైకి కాలినడకన వెళ్లాడు. ఎట్టకేలకు తన హీరో సోనూసూద్ను కలిశాడు. అప్పుడు ఆ అభిమానికి కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.
హైదరాబాద్కు చెందిన వెంకటేష్ 700 కిలోమీటర్ల దూరం నడిచి ముంబైకి చేరుకుని సోనూ సూద్ను కలిశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ అతన్ని ఆ పనిచేయవద్దని వారించాడు. అయినా వెంకటేష్ వినలేదు. కనీసం తనను కలిసేందుకు రవాణా సదుపాయం అయినా ఏర్పాటు చేస్తానని సోనూ వెంకటేష్కు తెలిపాడు. వెంకటేష్ అందుకు కూడా ఒప్పుకోలేదు. దీంతో సోనూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇక ఎట్టకేలకు వెంకటేష్ సోనూ సూద్ను ముంబైలో కలిసి ఫొటో దిగాడు. ఆ సమయంలో వెంకటేష్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
కాగా సోనూ సూద్ ఇప్పటికే దేశంలో ఎంతో మందికి సహాయం చేయగా, తాజాగా కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేక మందికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాడు. 150-200 పడకలు ఉన్న హాస్పిటల్స్కు సమీపంలో సోనూ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాడు. దీంతో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నాడు. కాగా సోనూ త్వరలో అక్షయ్ కుమార్ సరసన పృథ్వీ రాజ్ అనే బాలీవుడ్ మూవీతోపాటు తెలుగులో విడుదల కానున్న ఆచార్య మూవీలోనూ కనిపించనున్నాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…