మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు.. అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంటుంది. ఆయన సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ? అని వారు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఆయన హాలీవుడ్ చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది ? అభిమానుల్లో ఇంకా అంచనాలు భారీగా పెరిగిపోతాయి కదా. అవును. అయితే ఆయనకు ఆ అవకాశం వచ్చింది కానీ.. ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా ? అంటే..
1998లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అబు బాగ్దాద్ గజదొంగ అనే మూవీని ప్రారంభించారు. అప్పట్లో రూ.5 కోట్లు పెట్టడమే ఎక్కువ. అలాంటిది రూ.50 కోట్ల భారీ బడ్జెట్తో మూవీని ప్రారంభించారు. గ్రాండ్గా ఓపెనింగ్ కూడా అయింది. దీన్ని ఒకేసారి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కించారు. ఇంగ్లిష్ వెర్షన్కు డుషాన్ జర్సి దర్శకత్వం వహించగా, తెలుగు, హిందీ వెర్షన్లకు సురేష్ కృష్ణను దర్శకుడిగా తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు కోర్టులకెక్కారు. ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ పేపర్లను టీ కప్పులో ముంచే సీన్ ఒకటి ఉంది. దీంతో ఈ మూవీ షూటింగ్ను నిలిపివేయాలని సౌదీతోపాటు పలు ఇతర దేశాల్లోని వారు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో ఈ మూవీ షూటింగ్ను ఆపేయాలని కోర్టులు తీర్పులు చెప్పాయి. అలాగే ఈ మూవీకి చెందిన ఓ పోస్టర్లో సూర్య భగవానుడికి 9 రథాలు ఉన్నట్లు చూపించారు. కానీ హిందూ మతం ప్రకారం సూర్యుడికి 7 రథాలే ఉంటాయి. ఇది కూడా వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో కొందరు దీనిపై కోర్టుకెక్కగా కోర్టు మూవీ షూటింగ్ను ఆపేయమని చెప్పింది. అలా తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ మూవీ ఆగిపోయింది.
అయితే ఇదే మూవీ గనక అప్పట్లో వచ్చి ఉంటే బాహుబలి సాధించిన రికార్డులు అప్పట్లోనే ఈ మూవీ సాధించి ఉండేదని విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు. ఏది ఏమైనా హాలీవుడ్లో అడుగు పెట్టాలని తొలిసారిగా చిరంజీవి చేసిన ప్రయత్నం అలా దెబ్బ తిన్నది. దీంతో ఆయన ఎంతో నిరుత్సాహానికి గురయ్యారట.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…