బాబా కా దాబా తాత అందరికీ గుర్తుండే ఉంటాడు. రోడ్డు పక్కన ఉన్న స్టాల్ లో ఆహారం విక్రయిస్తూ ఒక్క వీడియో ద్వారా రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయిన ఈ తాత గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది.కరోనా వ్యాపించి చితికిపోయిన ఆ పెద్దాయన తన కష్టాలను ఆ వీడియోలో షేర్ చేసుకున్నారు.ఈ వీడియో చుడాగానే ఢిల్లీ వాసులు పెద్ద ఎత్తున ఈ తాత టిఫిన్ స్టాల్ ముందు
క్యూ కట్టారు.కేవలం ప్రజలు మాత్రమే కాకుండా స్విగ్గి, జోమాటో వంటి వంటి ఫుడ్ యాప్లు సైతం సహకరించడంతో ఈ తాత ఏకంగా ఓ రెస్టారెంట్ ను ప్రారంభించాడు.
మాల్వీయ నగర్లో నివసిస్తున్న కాంతా ప్రసాద్, ఆయన భార్య బదామీ దేవిలు ఫిబ్రవరి నెలలోనే తమ రెస్టారెంట్ మూసివేశారు. ఈ సందర్భంగా తాత కాంత ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ లాక్ డౌన్ కి ముందు ప్రతిరోజు రెస్టారెంట్ ఖర్చులు పోను సుమారుగా 3500 రూపాయలు లాభం వచ్చేది. కానీ ప్రస్తుతం అలాభం వెయ్యి రూపాయలకు పడిపోయింది. ఈ విధంగా రెస్టారెంట్ లో వచ్చే డబ్బులు మా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సరిపోవడం లేదు అందుకోసమే రెస్టారెంట్ మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు.
గత ఏడాది డిసెంబర్లో ఈ రెస్టారెంట్ ప్రారంభించిన కాంత ప్రసాద్ రెస్టారెంట్ ఖర్చులు అక్కడ పనిచేసే సిబ్బందికి కరెంటు బిల్లు, హోటల్ అదే మొత్తం కలిపి నెలకు లక్ష రూపాయల వరకు ఖర్చు అయ్యేది. కానీ రెస్టారెంట్ కి కనీసం 40000 కూడా ఆదాయం లేక పోవడం వల్లే హోటల్ ప్రారంభించిన మూడు నెలలకే మూసివేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా కాంతా ప్రసాద్ తెలిపారు.
ఈ విధంగా తమ హోటల్ మూడు నెలలకే మూసివేయడానికి కారణం సామాజిక కార్యకర్త తుశాంత్ అద్లాఖా అని ప్రసాద్ ఆరోపించారు. కొత్త రెస్టారెంట్ ప్రారంభించేందుకు ఆయనే సాయంచేశారు కానీ రెస్టారెంట్ బాధ్యతలను మర్చి పోవడం వల్లే రెస్టారెంట్ మూసివేయాల్సి వచ్చిందని తెలుపగా..అద్లాఖామాత్రం రెస్టారెంట్ నడుపకపోవడానికి కారణం కాంత ప్రసాద్ ఇద్దరు కొడుకులని తెలిపారు. వారిప్పుడు రెస్టారెంట్ బాధ్యతలను తీసుకోకుండా హోమ్ డెలివరీ ఆర్డర్లు పట్టించుకోకుండా ఉండటం వల్లే ఈ విధంగా హోటల్ మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఏదిఏమైనప్పటికీ కాంత ప్రసాద్ తిరిగి రోడ్డున స్టాల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…