సాధారణంగా మనం ఎక్కడికైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్మెట్ లేని వారిపై చలానా విధించడం మనం చూస్తున్నాము.ఈ విధంగా హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలకు ఎటువంటి హాని జరగదని,తప్పనిసరిగ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అధికారులు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తున్నారు.ఈ క్రమంలోనే హెల్మెట్ ధరించని వారిపై పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ధర్మారం గ్రామంలో ఓ రైతు తన పొలం పనుల నిమిత్తం హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళుతుండగా పోలీసులు అతనికి జరిమానా విధించారు.ధర్మారం గ్రామానికి చెందిన పొన్నం మల్లశేం తన స్కూటీపై రోజులాగే పొలం పనులకు వెళ్ళాడు. అయితే ఆ సమయంలో తను హెల్మెట్ ధరించలేదని 200 రూపాయలు ఫైన్ విధించడంతో రైతు ఎంతో ఆశ్చర్యపోయాడు.
మల్లేశం అనే రైతుకు 200 రూపాయల చలానాతోపాటు యూజర్ ఛార్జ్ 35 రూపాయలు వసూలు చేయడంతో సదరు రైతు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయంపై రైతు స్పందిస్తూ పోలీసులు అన్ని విషయాలలో ఇదేవిధంగా విధులు నిర్వహించాలంటూ పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఇకపై పొలం పనులకు వెళ్లేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,లేకపోతే వారు కూడా ఫైన్ చెల్లించక తప్పదని తెలుస్తోంది
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…