సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఒకటి. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు గాను చిత్ర యూనిట్ శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, ఆలియా భట్, అజయ్ దేవగన్ వంటి అగ్ర తారలు ఈ మూవీలో నటించారు. సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల చుట్టూ తిరిగే కల్పిత కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆలియా భట్ పాత్రకు సీత అని పేరు పెట్టారు. OTTనా, థియేటర్లా అని సినీ నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న సమయంలో, పరిశ్రమ కొంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో, ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే భారీ మొత్తంలో లాభాలను ఆర్జించింది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు వెర్షన్లలో విడుదల కానున్న ఈ చిత్రం శాటిలైట్, థియేటర్, డిజిటల్ హక్కులను అమ్మడం ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించింది. మింట్ నివేదిక ప్రకారం ష్యూర్-షాట్ బ్లాక్ బస్టర్ హక్కులను అమ్మడం ద్వారా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ రూ.350 కోట్లను సంపాదించింది.
ఇండియా టుడే నివేదిక ప్రకారం నిజాం ప్రాంతంలో రూ.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.100 కోట్లు, సీడెడ్ జిల్లాల్లో రూ.40 కోట్లు, కర్ణాటకలో రూ .50 కోట్లు వచ్చాయి. లాభాలను పంచుకోవడంలో దర్శకుడికి 50 శాతం వాటా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సంపాదించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ చిత్రానికి ఆలియా భట్ను ఎంపిక చేయడంపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ అగ్ర నటీనటుల ఎదుట నిలబడి ధైర్యంగా నటించగలిగే సత్తా ఉందని, అందుకే ఆలియాను ఎంపిక చేశామని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ అగ్ర నటులు. వారి మధ్య నిలబడి నటించాలంటే అందుకు తగిన నటి అవసరం. అందుకనే ఆలియాను ఎంపిక చేశా.. అని రాజమౌళి అన్నారు. అయితే ఈ మూవీని అంతకు ముందు ప్రేమకథ చిత్రం అని భావించారు. కానీ అది కాదని తరువాత తెలిసింది. మరి చిత్రం ఎలా ఉంటుందన్నది తెలియాలంటే విడుదల అయ్యే వరకు వేచి చూడక తప్పదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…