దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ దేశంలో 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్డౌన్లను విధించి అమలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో లాక్డౌన్ విధించే అంశంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ అనేక రోజులకు ప్రగతి భవన్ చేరుకుని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్తోపాటు ఇతర వైద్య శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదన్నారు.
లాక్డౌన్ విధించినప్పటికీ పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉందని, అందువల్ల తెలంగాణలో లాక్డౌన్ విధించబోమని అన్నారు. లాక్డౌన్ వల్ల ప్రజల జీవితాలు నాశనమవుతాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. అయితే రాష్ట్రంలో వీకెండ్ లాక్డౌన్ను విధించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు సూచించినందువల్లే రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను విధించారు కనుక కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో వీకెండ్ లాక్డౌన్ను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…